Saturday, July 27, 2024

కరోనా మహమ్మారి తిరిగి ప్రవేశం..

తప్పక చదవండి

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. గడిచిన 28 రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఏడాది జూలై 10 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు 28 రోజుల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అంతకుముందు 28 రోజుల కాలంతో పోల్చితే ఈ 28 రోజుల కాలంలో నమోదైన కొత్త కేసుల సంఖ్య 80 శాతం ఎక్కువని తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా ఓ ఐదు డబ్ల్యూహెచ్‌వో రీజియన్‌లలో మాత్రం కరోనా కొత్త కేసులు, మరణాల సంఖ్యలో తగ్గుదల నమోదైందని పేర్కొంది. వెస్టర్న్‌ పసిఫిక్‌ రీజియన్‌లో మాత్రం కొత్త కేసుల సంఖ్య పెరిగి, మరణాల సంఖ్య తగ్గిందని వెల్లడించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు