Thursday, May 9, 2024

కొత్తగా 146 అంబులెన్సులుజెండా ఊపి ప్రారంభించిన సిఎం జగన్‌

తప్పక చదవండి

అమరావతి :నూతనంగా 108 అంబులెన్స్‌ వాహనాలను సిఎం జగన్‌ ప్రారంభించారు. 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేస్తూ… కొత్తగా 146 అంబులెన్స్‌లను క్యాంపు కార్యాలయం వద్ద లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు.కొత్త 108 వాహనంలో వైద్య పరికరాలు, సౌకర్యాలను పరిశీలించిన ముఖ్యమంత్రి వాటి గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషాశ్రీచరణ్‌, రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), ఎంపీ నందిగాం సురేష్‌, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం టి కృష్ణబాబు, పలువురు ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు