Monday, April 29, 2024

ప్రాణం తీసిన అతివేగం

తప్పక చదవండి

జల్‌పల్లి : అతి వేగం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన పహాడీషరీఫ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకోంది. ఠాణా ఇన్‌స్పెక్టర్‌ కె. సతీష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌ రాష్ట్రనికి చెందిన హరేంద్ర చౌహాన్‌ (30), కృష్ణ చౌహాన్‌ (28) ఇద్దరు బంధువులు వృత్తిరీత్యా మహేశ్వరం మండలం రావిర్యాల్‌ గ్రామంలో నివసిస్తున్నారు. ఇదిలాఉండగా 2వ తేదీ ఆదివారం తమ ద్విచక్ర వాహనమైన స్ప్లెండర్‌ బైక్‌ (ఏపీ 09 బీటీ 2746) పై కూరగాయలు కొనుగోలు చేసి విజయ డెయిరీ వైపు ఇంటికి వెళుతున్న సమయంలో బైక్‌ను అతివేగంగా మరియు నిర్లక్ష్యంగా నడపడంతో అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. దింతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పహాడీషరీఫ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చి, 108 కు ఫోన్‌ చేసి ఇద్దరినీ ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం సాంబు చౌహాన్‌ కుమారుడు కృష్ణ చౌహాన్‌ (28) మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దింతో ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఠాణా ఎస్‌ఐ సి.వెంకటయ్య తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు