Saturday, July 27, 2024

పాకాల వాగులో కొట్టుకుపోయిన చెక్ డాం..!

తప్పక చదవండి
  • పలు పత్రికల్లో వార్తా కథనాలు వచ్చిన పట్టించుకోని అధికారులు..
  • కట్టి ఏడాది కూడా కాలే..! అప్పుడే కూలే..
  • నాసిరకం పనులతో కొన్ని కోట్లు నీళ్ళ పాలాయే..!

చెన్నారావుపేట :
మండలం, బొజెర్వు శివారు వద్ద, పాకల వాగుపై ప్రభుత్వం 2021 వ సంవత్సరంలో కొన్ని కోట్ల రుపాయల వ్యయంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పనులు ప్రారంభించాగా‌.. రైతులు ఇక మాకు రెండు పంటలకు ఢోకా లేదు అని సంబరపడ్డారు.. కానీ చెక్ నిర్మించి ఏడాది కాక ముందే ఒక్క సాధారణ వర్షానికే చెక్ డాం మట్టి కట్టతో పాటు సిమెంట్ వాల్ కూడ దెబ్బ తిని, వాగులో నీళ్ళు అగే పరిస్తితి లేకుండా పోయింది.

దీంతో రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి.. ప్రభుత్వం తక్షణమే క్రాంటక్టర్ పై చర్యలు తీసుకుని పనులు వెంటనే మెదలు పెట్టి.. శతాబ్దకాలం నిలిచిపోయే విధంగా నిర్మాణం చెయ్యాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు