Monday, May 13, 2024

బీఆర్ఎస్‌ నేత పాడె మోసిన బండి సంజయ్..

తప్పక చదవండి
  • హఠాన్మరణం చెందిన మహేందర్ రెడ్డి..
  • మృతుడు గతంలో ఏబీవీపీ కార్యకర్త..
  • ఆయనతో తనకు అనుబంధం ఉందన్న బండి సంజయ్..

హుజూరాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నేత నందగిరి మహేందర్ రెడ్డి హఠాన్మరణం చెందారు.. కాగా ఆయన అంతిమక్రియల్లో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి.. పాడె కూడా మోశారు. పాడెకు ఓ చివర బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఉండగా.. మరో చివర బండి సంజయ్ మోశారు. అయితే.. నందగిరి మహేందర్ రెడ్డి.. ఏబీవీపీ పూర్వ కార్యకర్త కాగా.. హుజురాబాద్ పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు కూడా. అందుకే తనతో ఉన్న అనుబంధంతోనే బండి సంజయ్ మహేందర్ రెడ్డి అంతిమ క్రియల్లో పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు