Saturday, May 11, 2024

హైదరాబాద్ లో బీజేపీ కీలక సమావేశం..

తప్పక చదవండి
  • హాజరైన పలు రాష్ట్రాల బీజేపీ కీలక నేతలు..
  • సరికొత్త నయా వ్యూహ రచన చేసిన సమావేశం..
  • ముఖ్యంగా దక్షిణాదిపై ఫోకస్ పెట్టిన నేతలు..

పొలిటికల్‌ పార్టీలలో బీజేపీ స్టైలే వేరు. ఎన్నికలు ఎక్కడైనా.. రాష్ట్రం ఏదైనా.. బీజేపీ ప్లాన్‌ మాత్రం పక్కాగా ఉంటుంది.. ఒక్కసారి టార్గెట్‌ సెలెక్ట్‌ చేసుకుందంటే తగ్గేదే ఉండదు.. ప్రత్యర్ధుల ఎత్తులను చిత్తు చేస్తూ ఊహించని వ్యూహాలతో దూసుకుపోవుడే కమలదళం స్టైల్‌.. అయితే, ఇదంతా ఉత్తరాదిలోనే.. దక్షిణాదిలో మాత్రం అనుకున్నంత సక్సెస్‌ సాధించలేకపోతోంది బీజేపీ. అందుకే, ఏదిఏమైనాసరే.. దక్షిణాదిలోనూ దంచికొట్టాలని డిసైడైంది కాషాయ పార్టీ. అందుకోసం సరికొత్తగా పావులు కదుపుతూ నయా వ్యూహరచన చేస్తోంది.

హైదరాబాద్‌లో కీలక సమావేశం..
దక్షిణాదిపై ఫోకస్‌ పెట్టిన బీజేపీ హైదరాబాద్‌లో కీలక సమావేశం నిర్వహించింది. ఈ కీలక మీటింగ్‌కి సౌతిండియా బీజేపీ ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ నుంచి పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మెయిన్‌ లీడర్స్‌ అటెండ్‌ అయ్యారు.
దక్షిణాదిలో బీజేపీ బలోపేతమే లక్ష్యం.. హైదరాబాద్‌ మీటింగ్‌ అజెండా ఇదే.. ఈ సింగిల్‌ పాయింట్‌ అజెండాతోనే సమావేశం జరిగింది. పార్టీని ఎలా బలోపేతం చేయాలి? అధికారం దక్కించుకోవడానికి ఏం చేయాలి? అనే అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. మెయిన్‌గా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు