Saturday, May 18, 2024

దేశానికే ఆదర్శం ఆరోగ్య మహిళ, కళ్యాణలక్ష్మీ

తప్పక చదవండి
  • మహిళాపథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌..
  • సూర్యాపేటలోని బాలాజీ ఫంక్షన్‌ హాల్లో వాసవి,
    వనిత క్లబ్‌ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు
  • ముఖ్యఅతిథిగా పాల్గొని గర్భిణీ మహిళలను
    ఆశీర్వదించిన మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

    సూర్యాపేట : మహిళా ఆరోగ్యం, సాధి కారతకు ముఖ్య మంత్రి కేసీ అర్‌ నాయకత్వం లోని తెలం గాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది అని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట లోని బాలాజీ ఫంక్షన్‌ హాల్లో వాసవి – వనిత క్లబ్‌ ఆధ్వర్యం లో సామూహిక సీమంతాలు కార్యక్రమానికి హాజరై న మంత్రి 104 మంది గర్భిణు లకు చీరలు, పండ్లు, పూలు పంపిణీ చేసి ఆశీర్వదించారు. అనంతరం మాట్లాడుతూ కులమత భేదాలు లేకుండా ఇంతమంది పేద మహిళలకు వనిత- వాసవి క్లబ్‌ ఆధ్వర్యం లోసామూహిక సీమంతాలు నిర్వహించడం అభినందనీయ మనిఅన్నారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళా సాధికారత లక్ష్యంగా పలు పథకాలను ప్రవేశపెట్టింద న్నారు.మహిళల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పథకాల అమలులో రాష్ట్రం చాలా ముందుందని అన్నారు.మహిళల హక్కులు, గౌరవాన్ని కాపాడుతూ సీఎం కేసీఆర్‌ కిట్‌తో ఆడబిడ్డలకు పౌష్టికాహారం అందిస్తూ కుటుంబ వైద్యురాలిగా, కళ్యాణలక్ష్మి కింద ఆడపిల్లల పెళ్లి ఖర్చులు చూసుకుంటూ కుటుంబ పెద్దగా నిలిచారన్నారు .గత తొమ్మిదేళ్లలో 13,90,636 మంది బాలిం తలు కేసీఆర్‌ కిట్‌ ద్వారా లబ్ధి పొందగా, 6.84 లక్షల మంది గర్భిణులకు కేసీఆర్‌ పౌష్టికాహార కిట్‌లు అందించారన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా 18,46,635 మంది మహిళలకు లబ్ధి చేకూరింద న్నారు.తెలంగాణ రాష్ట్రం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మహిళా సంక్షేమంలో సరికొత్త రికార్డు సృష్టించింది. సీఎం కేసీఆర్‌ పాలనలో మహిళలు సుఖసంతో షాల తో జీవిస్తునారని అన్నారు.కార్యక్రమం లో మాజీ మార్కేట్‌ ఛైర్మన్‌ ఉప్పల లలితా ఆనంద్‌, ఉప్పల ఆనంద్‌,గుండా శ్రీదేవి, రాచకొండ శ్రీనివాస్‌, చల్లా లక్ష్మీ కాంత్‌, రాచర్ల కమలాకర్‌, తోట శ్యామ్‌, లక్ష్మీ, వెంపటి సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు