Tuesday, May 14, 2024

ప్రజలు..కార్యకర్తల భవిష్యత్‌కు గ్యారెంటీ

తప్పక చదవండి
  • వచ్చే ఎన్నికలపై సన్నద్దతపై చర్చ
  • పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ
    అమరావతి : ప్రజలతోపాటు కార్యకర్తలు, నేతల భవిష్యత్తుకు గ్యారెంటీ ఉండేలా టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త కార్యాచరణ ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన నివాసంలో దాదాపు 3గంటలపాటు సమావేశమై వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో అనుకూలంగా మార్చుకునే విధానాన్ని చంద్రబాబు నేతలకు వివరించారు. బూత్‌ స్థాయి నుంచి ఇన్‌ఛార్జ్‌ వరకూ యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసుకునేలా రూపొందించిన కార్యాచరణను నేతల ముందు ఆవిష్కరించారు. బూత్‌ స్థాయి నుంచి ఇన్‌ఛార్జ్‌ వరకు ప్రతి ఒక్కరి పనితీరు పై రెండేసి సర్వేలు నిర్వహిస్తూ ప్రతి నెలా నివేదిక ఇచ్చే పక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రతీ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల ఫలితాలు విశ్లేషించి తాజా పరిస్థితులకు తగ్గట్టుగా నేతలకు కమిటీలు యాక్షన్‌ ప్లాన్‌ ఇవ్వనున్నాయి. ఇందుకోసం ప్రతీ నియోజకవర్గానికి బ్యాక్‌ ఆఫీస్‌ బృందంగా దాదాపు 10మంది సభ్యులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.బూత్‌ కమిటీలు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌, యూనిట్‌ ఇన్‌ఛార్జ్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పనితీరును కమిటీ సభ్యులు మదింపు చేయనున్నారు. ఏ స్థాయిలో పొరపాటు ఉంటే ఆ స్థాయిలోనే సరిదిద్దుకునేలా కమిటీలు ప్రతినెలా నివేదికలు ఇవ్వనున్నాయి. నాలుగు స్థాయిల్లో ప్రతీ ఒక్కరి పనితీరును పరిశీలించి వారికి పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. ప్రతీ ఇన్‌చార్జ్‌ పనితీరుపై రెండేసి సర్వేలు నిర్వహిస్తూ ప్రతి నెలా నివేదిక ఇచ్చే పక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రతీ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల ఫలితాలు విశ్లేషించి తాజా పరిస్థితులకు తగ్గట్టుగా నేతలకు యాక్షన్‌ ఎª`లాన్‌ను కమిటీలు ఇవ్వనున్నాయి. ఇందుకోసం ప్రతీ నియోజకవర్గానికి బ్యాకాఫీస్‌ బృందంగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. బూత్‌ కమిటీలు, క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ యూనిట్‌ ఇన్ఛార్జ్‌ పనితీరును కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. ఏ స్థాయిలో పొరపాటు ఉంటే ఆ స్థాయిలో తప్పులు సరిదిద్దుకునేలా ప్రతినెలా నివేదికలు ఇవ్వనున్నాయి. బూత్‌ స్థాయి నుంచి ఇంఛార్జి స్థాయి ప్రతీ ఒక్కరి పనితీరు ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన ప్రాధాన్యత ఇచ్చి పదవుల్లో ప్రాధాన్యం కల్పించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరి భవిష్యత్‌గు భరోసా ఇచ్చే లక్ష్యంతో చంద్రబాబు దీన్ని ప్రారంభించి నట్లుగా తెలుస్తోంది. పార్టీలో పలు వ్యవస్థలు ఇప్పటికే చరుగ్గా పని చేస్తున్నాయి. అయితే పర్యవేక్షణ అనేది చాలా ముఖ్యం కాబట్టి.. ఈ అంశంపై చంద్రబాబు ఎక్కువగా దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు