Sunday, May 19, 2024

పల్నాడు జిల్లాలో పెను విషాదం..

తప్పక చదవండి

ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడ్డ బాలుడిని కాపాడేందుకు యత్నించిన ఇద్దరితో పాటు బాలుడు మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో తీరని విషాదం నింపింది. జిల్లాలోని మాచవరం మండలం మోర్జంపాడులో గురువారం మధ్యాహ్నం మేకలను మేత కోసం ముగ్గురు గ్రామ శివారులోకి వెళ్లారు. వీరి వెంట ఉన్న బాలుడు ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడ్డాడు. బాలుడిని రక్షించేందుకు బావిలో దూకిన మరో ఇద్దరు బావిలోనే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకుని ఉన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు