Thursday, May 16, 2024

కేసీఆర్ ని మరోసారి గెలిపిద్దాం – సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్

తప్పక చదవండి
  • రెండు, మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. ఇదే జోష్ ను కొనసాగిద్దాం..
  • మన సుఖానికి, సంతోషానికి, ఆస్తికి అంతస్తుకు ఇలా అన్నింటికీ శివుడే కారణం. అయనే పరమేశ్వరుడు..
  • ఈ రోజు మన తెలంగాణ ను ఏలుతున్న చంద్రశేఖరుడు కూడా పరమేశ్వరుడే..
  • బ్లాక్ మెయిల్ రెడ్డి , తొండి సంజయ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి..

బీ.ఆర్.ఎస్. పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఖైరతాబాద్ అసెంబ్లీ, జూబిలీ హిల్స్ డివిజన్ లో సభ అధ్యక్షులు ఎమ్మెల్యే దానం నాగేందర్ నేతృత్వంలో సోమవారం రోజు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెంకటేష్, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, మామిడి నరసింగ్ రావు, ప్రసన్న, ఎల్లయ్య, దాసు, దీప, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ మహానేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రస్థానంలో నాడు సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిన ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులను, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ముఖ్యమంత్రిగా 9 ఏండ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన అందిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోవాలని కోరారు. జూన్ 2 నుంచి 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించుకుందామని బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాలను దేదీప్యమానంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది…? అన్న విషయాన్ని ప్రజలకు కండ్లకు కట్టినట్టు వివరించాల్సిన బాధ్యత అందరిమీదా ఉన్నదని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మూడు వారాలపాటు దద్దరిల్లాలని.. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం తీసుకరావాలని దాసోజు అన్నారు.

- Advertisement -

శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. మన బాధకు, సుఖానికి, దుఃఖానికి, సంతోషానికి ఇలా అన్నింటికీ శివుడే కారణం. అయన పరమేశ్వరుడు.. ఈరోజు మన తెలంగాణ ను ఏలుతున్న చంద్రశేఖరుడు కూడా పరమేశ్వరుడే. అందుకే భారతదేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా కేసీఆర్ ప్రజల గురించి ఆలోచిస్తూ వారిని కష్టాల నుండి బయటపడేస్తున్నాడు. ముఖ్యముగా పేద ప్రజల గురించి ప్రతి కష్ణం ఆలోచిస్తూ..వారి బాగోగులు చూసుకుంటూ, వారి కష్ట సుఖాలఫై ఆరా తీస్తూ వారి బ్రతుకుల్లో వెలుగు నింపుతున్న దేవుడు కేసీఆర్.. ఈరోజు కేసీఆర్ తెలంగాణను ఎంతగా అభివృద్ధి చేసారో చూస్తున్నాం. తెలంగాణ వచ్చిన సమయంలో 50 వేల కోట్ల ఉన్న బడ్జెట్..ఈరోజు మూడు లక్షలకు తీసుకొచ్చారు. ఎన్నో సంక్షేమ పధకాలు , అభివృద్ధి కార్యక్రమాలు, రూ. 200 ఉన్న పెన్షన్ ను రూ. 2000 లకు తీసుకొచ్చిన మహానాయకుడు కేసీఆర్. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసారు. అలాంటి కేసీఆర్ ని మూడోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని దాసోజు శ్రవణ్ అన్నారు. ఈరోజు తెలంగాణ అంటే భారత దేశానికే తలమానికంగా ఉంది. వరి ఉత్పత్తిలో గాని, కరెంట్ వినియోగంలో గాని, ఉత్పత్తిలో గాని ఇలా ఎందులో చూసిన తెలంగాణ నెం. వన్ స్థానంలో ఉండేలా కేసీఆర్ చేసారు. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, మన ఊరు – మన బడి, రైతుబంధు, దళిత బంధు , బస్తి దవాఖాన, మిషన్ భగీరధ ఇలా ఎన్నో పధకాలు తీసుకొచ్చిన మన నేతను మరోసారి ముఖ్యమంత్రిగా చేయాల్సిన భాద్యత మనపై ఉంది. ఎన్నో ఆసరా పెన్షన్లు తీసుకొచ్చిన కేసీఆర్ పై ఈరోజు కాంగ్రెస్ , బిజెపి పార్టీల నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయంలో పడేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలు ప్రతి రోజు, ప్రతి ఇంటికి వెళ్లి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి గురించి, ప్రజలకోసం తీసుకొచ్చిన సంక్షేమ పధకాల గురించి తెలియజేయాలన్నారు. ఈరోజు బ్లాక్ మెయిల్ రెడ్డి, తొండి సంజయ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రవణ్ పిలుపు నిచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు