Saturday, April 20, 2024

పాస్‌పోర్ట్‌ కోసం కోర్టుకెళ్లిన రాహుల్‌ గాంధీ

తప్పక చదవండి

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కొత్త పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో సాధారణ పాస్‌పోర్టు ను పొందేందుకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని ఢిల్లీ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాహుల్‌ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. ఈనెల 26న విచారణ చేపడతామని తెలిపింది. ప్రధాని ‘మోదీ ఇంటి పేరు’ వ్యాఖ్యల కేసులో గత మార్చిలో సూరత్‌ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుతో రాహుల్‌ తన ఎంపీ పదవిని కోల్పోయారు. ఇక ఎంపీ పదవిని కోల్పోయిన రాహుల్.. ఆ కోటాలో ఇచ్చిన డిప్లోమాటిక్ పాస్ పోర్ట్ సహా అన్ని రకాల ప్రయాణ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. దీంతో ఇప్పుడు కొత్తగా సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు