Saturday, July 27, 2024

కేసీఆర్ పై షర్మిల ఫైర్..

తప్పక చదవండి
  • కాళేశ్వరం అవినీతిపై విమర్శలు..
    తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శలు గుప్పించారు. “కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాణికి నీళ్లిచ్చామని దొర చెప్తుంటే.. సాగుకు చుక్క నీరు లేక కాలువల పొంటే బోర్లు వేసుకొనే దుస్థితి రైతులది. మండుటెండల్లో మత్తడి పారుతుందని కేసీఆర్ దొంగ పండుగలు చేస్తుంటే.. నారుమడికైనా కాసిన్ని నీళ్ళు లేవనేది రైతుల వాదన. 9 ఏళ్లలో ఉన్న బోర్లకు అదనంగా 15 లక్షల కొత్త బోర్లు పడ్డాయంటే.. దొర డ్రీమ్డ్ ప్రాజెక్ట్ పని తీరు చెప్పనక్కర్లే. మసి పూసి మారేడు కాయ చేసినట్లు.. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం “గోదారి నీళ్లను గోదారిలో ఎత్తిపోయడానికే”. అని ఆమె ఆరోపించారు.

“38 వేల కోట్లతో మహానేత కట్టాలనుకున్న తెలంగాణ జీవధార ప్రాణహిత – చేవెళ్లను రీడిజైన్ చేసి కల్వకుంట్ల కుటుంబానికి కమీషన్ల ధారగా మార్చాడు. కోటి ఎకరాల పేరుతో కోటి భ్రమలే తప్పా లక్ష ఎకరాలకు దిక్కులేదు. లక్ష 51 వేల కోట్లతో ప్రపంచం గర్వించే ప్రాజెక్ట్ కట్టి ఫామ్ హౌజ్ కి తప్పా తెలంగాణ మాగాణికి పారింది లేదు. బోరు ఉంటే సాగు.. లేకుంటే పడావులా ఉంది తెలంగాణ వ్యవసాయం. పనికి రాని ప్రాజెక్టులకు వేల కోట్లు కరెంట్ బిల్లులు కట్టే దొర. రైతులకు సరిపడా కరెంట్ మాత్రం ఇవ్వరు. కాలువల్లో నీళ్ళు రావు. బోర్లు నడవవు. పంటల్ని ఎండబెట్టి.. రైతుల్ని రోడ్లపైకి ఈడ్చి పట్టుమని 8 గంటలు ఇయ్యలేనోళ్లు.. 24 గంటలు ఇస్తున్నం అంటుంటే..దెయ్యాలు వేదాలు పలికినట్లుంది. 24గంటల ఉచిత విద్యుత్ అబద్ధం అనడానికి ట్రాన్స్ కో, జెన్కో సి.ఎం.డీ. చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. “మూడు పంటలు అబద్ధం – 24గంటల కరెంటు పచ్చి అబద్ధం”. అని షర్మిల ఆరోపించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు