Thursday, April 18, 2024

జూన్ 2 మూడు తీర్ల పండగ..

తప్పక చదవండి
  • మూడు తీర్ల పండగ..
  • హీట్ పుట్టిస్తున్న తెలంగాణ రాజకీయం..
  • రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంపై పార్టీల మధ్య మైలేజ్ ఫైట్..
  • పండుగ మాట అటుంచితే క్రెడిట్ కొట్టేయాలన్నదే ఇక్కడ ప్రాధాన్యం..
  • రాజకీయ లబ్ది తప్ప.. ఏమున్నది గర్వకారణం.. ?
  • అభివృద్ధి చేశారంటున్న బీ.ఆర్.ఎస్.
  • తెలంగాణ మేమే ఇచ్చామంటున్న కాంగ్రెస్..
  • మేము లేకపోతే తెలంగాణ లేదంటున్న బీజేపీ..
  • ఏ వైపు మొగ్గు చూపాలో అర్ధం కాక తలపట్టుకుంటున్న జనాలు..

జూన్ రెండో తారీఖు.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన మహోన్నతమైన రోజు.. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి నేటికి తొమ్మిదేళ్లు పూర్తి అవుతున్నాయి.. తొమ్మిథి సంవత్సరాలు పూర్తి చేసుకుని.. పదో ఏట అడుగుపెడుతున్న వేళ.. తెలంగాణలో సరికొత్త రాజకీయం వేడెక్కిస్తోంది.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంపై పార్టీల మధ్య మైలేజ్‌ ఫైట్‌ జరుగుతోంది. మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రాజకీయలబ్ధి కోసం పోటీ పోటీపడుతూ పరుగులు తీస్తున్నాయి ప్రధాన పార్టీలు.

ఒకవైపు అధికార పార్టీ బీ.ఆర్.ఎస్., మరోవైపు భారతీయ జనతా పార్టీ, ఇంకోవైపు కాంగ్రెస్‌. ఈ మూడు పార్టీలూ పొలిటికల్‌ మైలేజ్‌ కోసం తహతహలాడుతున్నాయి.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని ఎడాపెడా వాడుకుంటున్నాయి. తెలంగాణ తెచ్చింది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తామే అంటున్నారు బీ.ఆర్.ఎస్. నాయకులు.. 21 రోజులపాటు దశాబ్ది వేడుకలు జరపడానికి సర్వం సిద్ధం చేసింది.. అసలు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే కాంగ్రెస్‌ అంటోన్న ఆ పార్టీ లీడర్లు.. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాలు ఎగురవేసేందుకు సిద్ధం అవుతోంది. ఇక కేంద్రంలో అధికారం సాగిస్తున్న బీజేపీ కూడా వైభవంగా వేడుకలకు ప్రణాళిక సిద్ధం చేసింది. గోల్కొండ వేదికగా రెండ్రోజులపాటు వేడుకలు నిర్వహించబోతోంది కేంద్ర సాంస్కృతికశాఖ.

- Advertisement -

దశాబ్దంలో శతాబ్దికి సరిపడ అభివృద్ధి పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది అధికార బీ.ఆర్.ఎస్. ఇన్నాళ్లూ ఒక్క హైదరాబాద్‌లోనే వేడుకలు జరిగితే, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించేలా ప్లాన్ వేసింది.. 21రోజులపాటు స్టేట్‌వైడ్‌గా సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తోంది. తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని వివరిస్తూ ప్రజల్లోకి దూసుకుపోతోంది.. బీ.ఆర్.ఎస్. పార్టీ. కర్ణాటకలో బాలీచీ తన్నేసిన బీజేపీ ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటూ.. రాష్ట్రమంతటా వేడుకలు నిర్వహించే విధంగా సర్వం సిద్ధం చేసింది.. అసలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే బీజేపీ చొరవ వల్ల అని చెబుతోంది. సుష్మాస్వరాజ్‌ చేసిన కృషిని ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని తలదన్నేలా గ్రాండ్‌గా ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించేందుకు రంగంలోకి దిగింది కేంద్ర సాంస్కృతికశాఖ. ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నట్టు చెప్పారు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి. ఖిలా ఔర్‌ కహానీ పేరుతో కాంపిటీషన్స్‌ నిర్వహించబోతున్నట్టు చెప్పారు.

కాంగ్రెస్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బోయిన్‌పల్లి ఐడియాలజీ సెంటర్‌లో ఆవిర్భావ వేడుకలను నిర్వహించేలా ప్లాన్ చేసింది. ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో.. ఆ లక్ష్యాలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ ఫెయిల్ అయ్యారని ఆరోపిస్తోంది కాంగ్రెస్. ఇదే విషయాన్ని ఉత్సవాల వేదికగా ప్రజలకు వివరించాలని చూస్తోంది. ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ మాజీ స్పీకర్ మీరా కుమార్ కు సైతం ఆహ్వానం పంపించారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు.. ఇక నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని ప్రధాన పార్టీలు. పొలిటికల్‌ మైలేజ్‌ కోసం పోటాపోటీగా వేడుకలు నిర్వహిస్తున్నాయ్‌. మరి, ఈ ఫైట్‌లో పైచేయి ఎవరిది.. ఈ వేడుకల అనంతరం తేలిపోతుంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు