Wednesday, April 24, 2024

క్రికెట్ ఆస్ట్రేలియా డ‌బ్ల్యూటీసీ జ‌ట్టు…

తప్పక చదవండి

మ‌రో మూడు రోజుల్లో ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ మొద‌లుకానుంది. దాంతో, భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల‌లో విజేత‌గా నిలిచేది ఎవ‌రు? అనే ఉత్కంఠ అంద‌రిలో నెల‌కొంది. అయితే… టెస్టు చాంపియ‌న్‌షిప్ సీజ‌న్‌లో అత్య‌ద్భుతంగా రాణించిన 11 మంది ఆట‌గాళ్లతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు డ‌బ్ల్యూటీసీ జ‌ట్టును ప్ర‌క‌టించింది. 2021 -23 మ‌ధ్య కాలంలో సంచ‌ల‌న ఆట‌తో వార్త‌ల్లో నిలిచిన ప్లేయ‌ర్స్ ఈ టీమ్‌లో చోటు ద‌క్కించుకున్నారు. ప్యాట్ క‌మిన్స్‌(ఆస్ట్రేలియా) కెప్టెన్‌గా ఉన్న ఈ టీమ్‌లో ముగ్గురు భార‌త క్రికెట‌ర్లు ఉన్నారు.

ఆ ముగ్గురు ఎవ‌రంటే..? డాషింగ్ వికెట్ కీప‌ర్ రిష‌భ్ పంత్, ఆల్‌రౌండ‌ర్లు ర‌వీంద్ర జ‌డేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌. ఆస్ట్రేలియా నుంచి ఓపెన‌ర్ ఉస్మాన్ ఖ‌వాజా, ట్రావిస్ హెడ్ ఎంపిక‌య్యారు. ఇంగ్లండ్ ఆట‌గాళ్లు జో రూట్, జేమ్స్ అండ‌ర్స‌న్ ఈ జాబితాలో ఉన్నారు. క‌రుణ‌ర‌త్నే (శ్రీ‌లంక‌), క‌గిసో ర‌బ‌డ‌ (ద‌క్షిణాఫ్రికా), బాబార్ ఆజం (పాకిస్థాన్ ) డ‌బ్ల్యూటీసీ జ‌ట్టుకు సెల‌క్ట్ అయ్యారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు