Saturday, July 27, 2024

గురువులకు అంకితం గురుపౌర్ణమి,(వ్యాస పౌర్ణమి.).

తప్పక చదవండి

భారతదేశంలో ప్రాచీన సనాతన సంప్రదాయం ప్రకారం గురువుకి అంకితం చేసిన ముఖ్యమైన రోజును గురుపౌర్ణమి గా జరుపుకుంటారు. గురువు అంటే ఉపాధ్యాయుడు. గు, అంటే చీకటి లేదా అజ్ఞానం, ,రు, ఆ చీకటిని తొలగించే వారని అర్థం. అనగా అజ్ఞానం యొక్క చీకటిని తొలగించే వారు గురువు అని అర్థం. గురుపౌర్ణమి అనేది ఆధ్యాత్మిక గురువులు మరియు ఉపాధ్యాయుల మంచితనాన్ని స్మరించే రోజు. గురువు ఒక బిడ్డకు విద్యను అందించి ప్రకాశ వంతము చేసే వ్యక్తిగా గురువు ప్రాచీన కాలం నుండి గౌరవింప బడ్డాడు. గురువు తోనే పిల్లల జీవితం సంపూర్ణంగా ఉంటుంది. గురుపౌర్ణమి ప్రతి సంవత్సరం ఆషాడ మాసం పూర్ణిమ తిథి రోజున వస్తుంది. ఈ సంవత్సరం జూలై 3న గురుపౌర్ణమి వచ్చింది. అదేవిధంగా మహాభారత కావ్యాన్ని రచించిన వేదవ్యాసుని జన్మదినం రోజు కూడా గురుపూర్ణిమ గా భావిస్తారు. ఈ పౌర్ణమి రోజున వేదవ్యాస ముని సత్యవతి, పరాశర దంపతులకు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. భారతదేశంలో మహాభారత, ఇతిహాసాల రచయితగా వేదవ్యాస మహర్షి ప్రశంసలందుకున్నారు. అలాగే ప్రాచీన వేదా లైన ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదం అని నాలుగు వేదాలను, నాలుగు గ్రంథాలుగా వర్గీకరించాడు వేదవ్యాసుడు. అదేవిధంగా ఆయనకు నలుగురు శిష్యులు ఉన్నారు. వారు పైలా, వైశంపాయన, జైమిని, మరియు సుమంతు ఈ నలుగురు శిష్యులు వ్యాసముని వారసత్వాన్ని పుచ్చుకొని ప్రాచీన భారతంలో వ్యాసున్ని గౌరవించే విధంగా పూజలు చేశారు. అంతేకాకుండా ఆషాడ పౌర్ణమి రోజున బౌద్ధ మత స్థాపకుడైన గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన రోజు కూడా ఈ రోజే . బుద్ధుడు జ్ఞానోదయం పొందిన రోజున బౌద్ధులు , గౌతమ బుద్ధుని బోధనలను గౌరవించడానికి గురుపూర్ణిమ వేడుకలను బౌద్ధులు కూడా జరుపుకుంటారు. గౌతము గౌతముడు బోధి చెట్టు కింద జ్ఞానోదయమైన ఐదు రోజుల తర్వాత గౌతమ బుద్ధుడు బోధ గయ నుండి ఉత్తరప్రదేశ్ లోని సారనాథ్ కి వెళ్ళాడు. ఆ రోజు పౌర్ణమి రోజు అక్కడ ఉపన్యాసం ఇచ్చాడు. అందుకే బుద్ధుని అనుచరులు ఆయన ఆరాధించడానికి ఈ రోజును వేడుక లాగా జరుపుకుంటారు. అందుకే గురుపూర్ణిమ ను, వ్యాస పూర్ణిమ గా, బుద్ధ పూర్ణిమ గా పిలుస్తారు. వేదవ్యాసుడు గురు శిష్యుల సంప్రదాయానికి మార్గదర్శకుడు అని చెప్తున్నది. ఇది ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం గా ఉద్భవించింది. మానవులు జ్ఞాని అయినా ఆధ్యాత్మిక మరియు విద్య ,గురువులకు అంకితంగా గురుపౌర్ణమి కార్యకలా పాల వేడుకగా అభివర్ణిస్తారు. కానీ నేడు గురు శిష్యుల సంబంధం విలువలతో కూడిన దిగా ఉండడం లేదు. ప్రాచీన కాలంలో గురువుల వద్దకే శిష్యుడు వెళ్లి విద్య విలువిద్యలు , శాస్త్రాలు, రామాయణ, మహాభారత ,ఇతిహాసాలు అభ్యసించేవారు. నేడు శిష్యుల వద్దకే గురువులు వె ళ్లి విద్యా బోధన చేసే రోజులు వచ్చాయి. అందుకే గురుశిష్యుల మధ్య సంబంధాలు తగ్గాయి. గురువుల ను గౌరవించే ,పూజించే సాంప్రదాయం రోజు రోజుకు మారుతున్నది .గురు పౌర్ణమి రోజున షిరిడి సాయి బాబా జన్మదినం గా కూడా సాయి భక్తులు అంగరంగ వైభవంగా ఆలయాల్లో నిర్వహిస్తూ మన కార్యక్రమాలు కూడా చేస్తారు. జైన మతస్తులు కూడా గురు పూర్ణిమ రోజున ట్రే నోర్ గుహ పూర్ణిమ గా జరుపు కుంటారు. అందుకే గురుపూర్ణిమ హిందూ, బౌద్ధ, జై న మతాల సాంప్రదాయంగా జరుపు కునే వేడుకగా చెప్ప వచ్చును.

కామిడి సతీశ్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా…
9848445134.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు