Saturday, May 4, 2024

రోల్ మోడల్ గా తెలంగాణ నిలుస్తోంది..

తప్పక చదవండి
  • తెలంగాణ వైపు భారత దేశం చూస్తోంది..
  • పవర్ పర్ క్యాపిటల్లో నెంబర్ వాల్ లో ఉన్నాం..
  • నిర్మల్‌ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్..
  • నిర్మల్ జిల్లాలో 396 గ్రామ‌ పంచాయ‌తీలకు ఒక్కో దానికి
    రూ.10 ల‌క్షల చొప్పున నిధులు ఇస్తున్నాం : కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ మోడ‌ల్ భార‌త‌దేశ‌మంతా మార్మోగుతోంద‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకు మీరే కార‌ణ‌మ‌ని(ప్రభుత్వ ఉద్యోగులు) కేసీఆర్ స్పష్టం చేశారు. నిర్మల్ క‌లెక్టరేట్‌ను ప్రారంభించిన అనంత‌రం ఉద్యోగుల‌ను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ‘‘ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలుగా విభ‌జింప‌బ‌డి ప‌రిపాల‌న ప్రజ‌ల‌కు దగ్గరైంది. నాలుగు జిల్లాల‌కు మెడిక‌ల్ కాలేజీలు వ‌స్తున్నాయి. ఆసిఫాబాద్ లాంటి అటవీ ప్రాంతంలోనూ మెడిక‌ల్ కాలేజీ వ‌చ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే 50 ఏళ్లకు కూడా మెడికల్ కాలేజీ వ‌చ్చేది కాదు. ప‌వ‌ర్ ప‌ర్ క్యాపిట‌లో నంబ‌ర్ వ‌న్ లో ఉన్నాం. ముఖ్రా కే గ్రామం జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకుని.. రాష్ట్రానికి గౌర‌వం తెచ్చిపెట్టింది’’ అని వ్యాఖ్యానించారు.

‘‘ద‌ళిత జాతి, గిరిజ‌న జాతి, వెనుక‌బ‌డి త‌ర‌గ‌తుల్లో నిరుపేద‌లు ఉన్నారు. జ‌ర‌గాల్సింది చాలా ఉంది. ఇదే ప‌ట్టుద‌ల.. కృషితో ముందుకు పోయి మ‌న సోద‌రులుగా ఉన్న ద‌ళిత‌, గిరిజ‌న‌, వెనుక‌బ‌డిన త‌ర‌గతులు, అగ్ర వ‌ర్ణాల్లో ఉన్న నిరుపేద‌ల‌ను స‌మాన స్థాయికి తీసుకుపోవాలి. ఎన్నిక‌ల త‌ర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ సెంట‌ర్లు ఏర్పాటు చేస్తాం. గ‌తంలో తాగు, క‌రెంట్, సాగునీటి స‌మ‌స్యలు ఉండేవి. వీట‌న్నింటిని 9 ఏళ్లల్లో అధిగ‌మించాం. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగుంది కాబ‌ట్టి.. భ‌విష్యత్ కోసం పురోగ‌మించాలి. క‌ష్టప‌డి పేద‌రికాన్ని త‌రిమేయాలి. దేశానికే త‌ల‌మానికంగా ఉండాలి. పోడు భూముల పంపిణీని నిర్వహించాలి. ఈ సీజ‌న్ నుంచే రైతుబంధు అందించే ప‌నిలో ప్రభుత్వం ఉంది. మ‌హారాష్ట్ర ప్రజ‌లు మ‌న ప‌థ‌కాల‌ను చూసి తెలంగాణ మోడ‌ల్ కావాల‌ని కోరుతున్నారు. తెలంగాణ మోడ‌ల్ భార‌త‌దేశ‌మంతా మార్మోగుతుంది. అందుకు మీరే కార‌ణం’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

అంతకుముందు.. నిర్మల్‌ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం (జూన్ 4న) ప్రారంభించారు. మొదట కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్‌ సీటులో వరుణ్‌ రెడ్డిని కూర్చండబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్‌ వద్ద పోలీస్‌ సిబ్బంది ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ శాంతికుమారి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌, ఎమ్మెల్యేలు జోగు రామన్న, బాల్క సుమన్‌, జీవన్‌రెడ్డి, రేఖా నాయక్‌, నడిపెల్లి దివాకర్‌రావు పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లాలోని గ్రామ పంచాయ‌తీల‌కు, మండ‌ల కేంద్రాల‌కు, మున్సిపాలిటీల‌కు సీఎం కేసీఆర్ భారీగా నిధులు మంజూరు చేశారు. ‘‘ఇవాళ నిర్మల్ జిల్లాలో 396 గ్రామ‌ పంచాయ‌తీలు ఉన్నాయి. ఒక్కో గ్రామ పంచాయ‌తీకి ప్రత్యేకంగా రూ.10 ల‌క్షల చొప్పున నిధులు ఇస్తున్నాం. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీల‌కు రూ.25 కోట్ల చొప్పున ప్రక‌టిస్తున్నాం. ఇవి కాకుండా నిర్మల్ జిల్లాలో 19 మండ‌ల కేంద్రాల‌కు రూ. 20 ల‌క్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాం’’ అని కేసీఆర్ ప్రక‌టించారు. నిర్మల్ జిల్లా క‌లెక్టరేట్‌, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం అనంత‌రం నిర్మల్‌ రూరల్‌ మండలంలోని ఎల్లపెల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ మాట్లాడారు. ఇటీవల విడుద‌లై ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో తెలంగాణ‌లోనే నిర్మల్ జిల్లా నంబ‌ర్ వ‌న్‌గా నిలిచింద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. బాస‌ర‌ స‌ర‌స్వతి అమ్మవారి ఆల‌యాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోబోతున్నామని చెప్పారు. ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనకు వస్తానని కేసీఆర్ తెలిపారు.

‘‘కాంగ్రెస్ పార్టీ వాళ్లు ధరణి పోర్డల్ ను బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు. వాళ్లనే బంగాళాఖాతంలో వేయాలే. మహారాష్ట్రలో బ్యాంకులో అమౌంట్ పడితే ఆశ్చర్యపోతున్నారు. కాంగ్రెస్ దుర్మార్గులు 50 ఏళ్ల పాలనలో నీళ్ళు కూడా ఇవ్వలేదు. ఒకప్పడు కరెంట్ అంటే రైతులు భయపడే పరిస్థితి ఉండే. వీళ్లు వస్తే మళ్లీ అదే పరిస్థితి వస్తుంది. రైతు బంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్ అంటారు. మనం రావాలా వాళ్లు రావాల్నా మీరే ఆలోచన చేయలే. ప్రతిపక్ష నాయకులు అధికారం కోసం ఆగం ఆగం చేస్తున్నారు. అధికారం లేనందున ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు’’ అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు