Thursday, April 25, 2024

దశాబ్ది తెలంగాణ సంబురాలు

తప్పక చదవండి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని జూన్ 2 న దశాబ్దిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అవతరణ దినోత్సవం సంబురాలు 21 రోజుల పాటు రోజుకు ఒక ప్రత్యేకతతో కార్యక్రమాలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు 105 కోట్లు కేటాయించి ఆ ఉత్సవ వేడుకలలో అందరిని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయం ఉట్టి పడేలా సంబురాలు ఘనంగా నిర్వహించాలని ప్రణాళిక తయారు చేసింది. ఆనాడు తెలంగాణ ప్రాంతం ఆంధ్ర పాలనలో రాజకీయ, ఆర్థిక, సామాజికంగా వెనుకబడింది, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి ప్రత్యేక రాష్ట్రం ద్వారానే సాధ్యం అవుతుందని భావించి తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ముందుకు వెళ్లి, పోరాట అమరుల త్యాగ ఫలితంగా రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆశయాలను అమలు చేస్తూ వ్యవసాయానికి సాగు నీరు అందించాలనే లక్ష్యంతో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అతి తక్కువ కాలంలో నిర్మించిన భారీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ద్వారా ప్రతి ఎకరానికి సాగు నీరు అందిస్తున్న ఘనత కేసిఆర్ ది. మిషన్ కాకతీయతో ప్రతి చెరువు, కుంట పునర్ నిర్మాణం చేసి నిండు జల కళల కనబడుతూ ఒక్కప్పుడు నెర్రలు వారినా భూమిని నేడు కృష్ణా,గోదావరి జలాలతో తడుపుతున్నారు. రైతులు ఏడాదికి రెండు పంటలు పండిస్తూ రాజులా జీవిస్తున్నారు. రైతులకు ఉచిత 24 గంటల కరెంట్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులకు ఉచిత ఎరువులు వ్యవసాయ సామాగ్రిలకు రాయితీలు కల్పిస్తుంది. రైతులు పండించిన పంట దాచుకోవడానికి గోదాంలు, గిడ్డంగులు, రైతులు సమావేశాలు నిర్వహిచుకోవాడానికి రైతు వేదికలు ఏర్పాటు చేసింది. రైతు బంధు, రైతు భీమాతో రైతుకు అండగా నిలబడుతుంది తెలంగాణ సర్కారు. రైతును రాజు చేయాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు క్షేమం గురించి ఆలోచిస్తూ రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను తీసుకు వచ్చినప్పుడు రైతులకు మద్దతుగా నిలబడి కేంద్రంతో పోరాడాడు కేసిఆర్. గత పాలనలో రైతుల ఆత్మహత్యలు ఎటూ చూసిన పరెలు వాళిన నేలతో ఎడారిలా కనబడేది అప్పటి గొర్ల కాపరులు మేపు కోసం పక్క రాష్ట్రాలకు తీసుకు వెళ్లిన చరిత్ర ఉంది అటువంటి పరిస్థితుల నుండి తెలంగాణ సరిహద్దు ప్రాంతలాలో ఇతర రాష్ట్రాల కూలీలు తెలంగాణకు ఉపాధికై వలస వస్తున్నారు. ఒక్కప్పటి కరవు జిల్లా పాలమూరు నేడు పచ్చని మాగనితో కళ కళలాడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇంటికి చుట్టాలు వస్తున్నారు అంటే భయమేసేది ఎందుకంటే త్రాగడానికి నీరు కరువు మైళ్ళ దూరం నడుచుకుంటు మహిళలు తెచ్చుకునే వారు ఆ రోజులు పోయి నేడు ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. మన పరిపాలన మనకే అని మన ప్రాంత నిధులు సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఒక్కరికి చేరాలని భావించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నేడు అన్ని కులాల వారికి చేయూత అందిస్తూ కుల వృతులను ప్రోత్సహిస్తూ చేర్మెన్ లను నియమించి, వివిధ కులాల వారికి కార్పోరేషన్, పెడరేషన్ ల ద్వారా ఋణాలు మంజూరు చేస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నాడు కేసిఆర్. వివిధ మతాల వారిని ఆధారిస్తూ క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ లకు దుస్తుల పంపిణీ చేస్తూ బోనాలు నిధులు మంజురూ చేస్తూ అన్ని మతాలను భిన్నత్వంలో – ఏకత్వంగా సర్వ మతాలను సమానంగా పరిపాలిస్తున్నారు. అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి సోదర భావంతో తెలంగాణలో జీవిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు అంటే పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ముఖ్య చొరవ అని చెప్పవచ్చు, పరిశ్రమల స్థాపన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక లాభం చేకూరుతుంది, స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తెలంగాణ ప్రాంతంలో వాతావరణ, విస్తీర్ణం పరముగా అనుకూలంగా శాంతియుత వాతావరణం ఉంది. కంపెనీ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి అనుమతులను నిర్ణీత సమయంలో ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం. నియామకాల విషయంలో ప్రభుత్వం యువత ఆదర్శంగా జీవించాలంటే చిన్న నాటి నుండే విద్యా బుద్దులు తప్పనిసరి అని భావించి గురుకులాలు, మండల్ పాఠశాలలు, ప్రభుత్వ బడులలో సకల వసతులు కల్పించి వారికి కార్పోరేట్ బడులకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తుంది తెలంగాణ సర్కార్. శిథిల వ్యవస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజిలు, డిగ్రీ లను పునర్ నిర్మాణం చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజి లను ఏర్పాటు చేసి పేద విద్యార్థుల ఉన్నత చదువును అందిస్తుంది. ఆంధ్ర పాలనలో అభివృద్ధికి నోచుకోని యూనివర్సిటీలను బలోపేతం చేసి నూతన హంగులతో తీర్చిదిద్ది రాష్ట్ర ప్రభుత్వం. ఇతర చదువుల కోసం బయటి దేశాలకు వెళ్లే వారికి ఒవర్ సీస్ స్కాలర్ షిప్ ల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. తెలంగాణ ప్రాంత ఇంజనీరింగ్ విద్యార్థులకు టీ హౕబ్ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా యువత ఆర్థికంగా ఎదిగినప్పుడే వారి కుటుంబాలు బాగుంటాయని భావించి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. కేసిఆర్ పాలనలో సకల జీవరాసులు మనుగడ సాగిస్తున్నాయి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయం హరితహారం దీంతో అటవీ ఉత్పత్తులు పెరగడంతో పాటు వాతావరణ సమతుల్యత ఏర్పడింది, సరైన సమయంలో వర్షాలు రావడంతో భూగర్భ జలాలు కూడా పెరిగాయి. నేడు గ్రామాలన్నీ సర్వ సుందరంగా తీర్చి దిద్దీ తాండలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసిఆర్ ది. మహిళలు రాజకీయ, ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందాలని వారికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికలలో యాభై శాతం రిజర్వేషన్ అమలు చేస్తుంది. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ను ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం పుట్టిన బిడ్డ దగ్గర నుండి వృదుల వరకు ఎదో ఒక సంక్షేమ పథకం అందుతుంది. బీఆర్ఎస్ సంక్షేమం అందని ఇల్లు లేదు అభివృద్ధి ఫలాలు పొందని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ అమరుల ఆశయాలకై కేసిఆర్ ముందుకు అడుగులు వేస్తున్నాడు.

  మిద్దె సురేష్
 కవి, వ్యాసకర్త
9701209355
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు