Tuesday, April 16, 2024

గుండెపోటుతో ఎస్‌ఐ ప్రభాకర్ మృతి

తప్పక చదవండి

హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి మృతి చెందాడు. గండిమైసమ్మ ప్రాంతంలోని తన ఇంట్లో రాత్రి 9 గంటల సమయంలో ఆకస్మిక గుండెపోటుతో ఎస్‌ఐ ప్రభాకర్ కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రభాకర్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువైపోయాయి. అప్పటివరకు యాక్టివ్‌గా ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. వ్యాయామాలు చేస్తూ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చేవారు కూడా హార్ట్ ఎటాక్‌కు గురై సెక్లన్లలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. 30 ఏళ్ల వయస్సు ఉన్న యువకులు కూడా గుండెపోటుతో మరణిస్తుండటం కలవరపెడుతోంది. జిమ్‌ చేస్తూ, గేమ్స్ ఆడుతూ, డ్యాన్స్ వేస్తూ ఒక్కసారిగా హార్ట్‌స్ట్రోక్‌తో కింద పడిపోతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోతున్నారు. కరోనా తర్వాత గుండెపోటు మరణాలు పెరగడం మరింత ఆందోళన కల్గిస్తోంది. ఎక్కువగా జరుగుతున్న గుండెపోటు మరణాలకు కారణాలు ఏంటనేది అర్ధం కావడం లేదు. ఆహార జాగ్రత్తలు తీసుకోకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం లాంటివి కారణాలుగా డాక్టర్లు చెబుతున్నారు. గతంలో హైదరాబాద్‌లో ఓ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచిన సీసీ టీటీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ ఒక్కసారిగా హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. ఆ తర్వాత రాష్ట్రంలో పలువురు కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు గుండెపోటుతో మరణించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు