Friday, April 19, 2024

బొడ్రాయి పండుగకు హాజరైన రామ్ నర్సింహ గౌడ్..

తప్పక చదవండి

నకేరికల్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
నార్కట్ పల్లి మండలం, గోపలయపల్లి గ్రామంలో జరిగిన గ్రామ బొడ్రాయి శిలా ప్రతిష్ఠ, శ్రీ ముత్యాలమ్మ, కనగంటి మైసమ్మ, మారమ్మ దేవతల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంనికి కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకుడు, హైకోర్టు అడ్వకేట్ వీరమల్ల రామ్ నర్సింహ గౌడ్..
ఈ సదర్భంగా రామ్ నర్సింహ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని దేవతలను కోరడమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ కులస్తులు కసాని ముత్యాలు గౌడ్, పల్చం భాస్కర్ గౌడ్, మునుకుంట్ల నర్సింహ గౌడ్, కొప్పు కృష గౌడ్, ఉయ్యాల గోపాల్ గౌడ్, కొప్పు శివ కుమార్ గౌడ్, కొప్పు రమేష్ గౌడ్, కాసాని శేఖర్ గౌడ్, కొప్పు నర్సింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు