హైదరాబాద్, జన్నారం మండలం బంగారు తండాలో శ్రీ జగదంబ దేవి శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మేల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.. యావత్ తెలంగాణ రైతాంగం సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వ రూ. 20 లక్షలు మంజూరు చెయ్యటం జరిగింది అని, మళ్ళీ ఒక 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..