- నేడు హైదరాబాద్కు రాహుల్ గాంధీ
- ఏకబిగిన ఖమ్మం, వరంగల్లో ప్రచారం
- నేడు మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం
- ఖర్గే చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదల
- కీలక హామీలు ప్రకటించే దిశగా అడుగులు
- మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు వెల్లడి
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణకు వస్తున్నారు. నవంబర్ 17న శుక్రవారం హైదరాబాద్ కు రానున్న రాహుల్ గాంధీ ఒక్కరోజే ఏకంగా 5 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఢల్లీి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని, అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఉదయం 11 గంటలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాకకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పినపాకలో రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. పినపాక నుంచి హెలికాప్టర్లో నర్సంపేటకు రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు నర్సంపేటలో రాహుల్ గాంధీ ఉండనున్నారు. నర్సంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి చేరుకోనున్న రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. వరంగల్ ఈస్ట్ లో సాయంత్రం నాలుగు గంటలకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. వరంగల్ ఈస్ట్ నుంచి వెస్ట్ నియోజకవర్గానికి అక్కడి నుంచి రాహుల్ గాంధీ వెళ్తారు. సాయంత్రం 6:30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ రాజేంద్రనగర్ రానున్నారు. రాజేంద్రనగర్ సమావేశం అనంతరం రాహుల్ గాంధీ ఢల్లీి వెళ్లిపోనున్నారు. ఇకపోతే ఇదేరోజు హైదరాబాద్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఖర్గే బేగంపేట ఎయిర్ పోర్ట్కి ఖర్గే చేరుకొనున్నారు. ఉదయం 11 గంటలకు ఖర్గే గాంధీ భవన్కు చేరుకొని.. 11 గంటలకు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ బహిరంగ సభలో ఖర్గే పాల్గొననున్నారు. సమావేశం తర్వాత హైదరాబాద్ లోనే ఖర్గే బస చేసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉదయం 10.30 గంటలకు తిరిగి ఖర్గే బెంగళూరుకు వెళ్లనున్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలతెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాలని గట్టి పట్టుదలగా ఉంది. చాలా రోజుల కిందటే ఆరు గ్యారంటీల్ని ప్రకటించి..విస్తృతం గా ప్రజల్లోకి తీసుకెళ్లింది. అదే సమయంలో వివిధ వర్గాలకు డిక్లరేషన్లు ప్రకటించింది. అన్నీ కలిపి తాజాగా మేనిఫెస్టో ప్రకటించనుంది. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే హైదరాబాద్ వేదికగా మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు కమటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు వెల్లడిరచారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే పేదలకు పెళ్లిళ్లకు సాయం కింద రూ. లక్ష వరకూ నగదు ఇస్తున్నారు. ఆ నగదుతో పాటు ఇక నుంచి తులం బంగారం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టనున్నారు. అలాగే చాలా కాలం నంచి ధరణని రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ధరణి స్థానంలో భూభారతి అనే విధానాన్ని తెస్తామని.. ధరణిలో ఉన్న లోపాలన్నింటనీ సవరిస్తామని కాంగ్రెస్ పార్ట హామీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే సిటిజన్ చార్ట్ కి చట్టబద్దత కల్పించే ఆలోచనచేస్తున్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో తామ మూడోసారి గెలిస్తే సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే హామీ ఇస్తోంది. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని మేనిపెస్టోలో పెట్టే అవకాశం ఉంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మొదట్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించుకుంద. ప్రకటనలు, సంచులు కూడా ఆర్డర్ ఇచ్చింది. కానీ సన్నబియ్యం పంపిణీ సాధ్యం కాదని తేలడంతో సన్నబియ్యం ఇస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని అప్పటి మంత్రి కొడాలి నాని ప్రకటించారు. ఆ తర్వాత సన్నబియ్యం ప్రస్తావన వైసీపీ తీసుకు రాలేదు. ఇప్పుడు తెలంగాణలో రెండు ప్రధాన పార్టీలు సన్నబియ్యం హామీ ఇస్తున్నాయి. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది కానీ బియ్యం లేకపోవడం వల్ల డబ్బుల ఇస్తోంది. అలాగే.. అమ్మ హస్తం పథకం పేరుతో 9 నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలని నిర్ణయించకున్నారు. ఆర్ఎంపీలకు గుర్తింపు కార్డు, రేషన్ డీలర్లకు గౌరవ వేతనం , వార్డు సభ్యులు గౌరవ వేతనం, ఎంబీసీ లకు ప్రత్యేక కార్పొరేషన్, ట్రాన్స్ జెండర్లకు ఆటోలు ,ప్రత్యేక సంక్షేమ పథకాలు , జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను పెట్టనున్నట్లుగా మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కన్నా మెరుగైన హామీలు ఇవ్వాలని ప్రజల్ని ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ అంటే సంక్షేమ రాజ్యమని మరోసారి నిరూపిస్తామని అంటున్నారు.