Sunday, May 19, 2024

ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులకు మోక్ష మెప్పుడో..

తప్పక చదవండి

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన బిల్లులు తప్ప మరేరకమైన సప్లిమెంటరీ బిల్లులు, జిపిఎఫ్, టి ఎస్ జి ఎల్ ఐ, సరెండర్ లీవ్, మెడికల్ బిల్లులు నెలల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయి.. ఉపాధ్యాయులు, ఉద్యోగులు వైద్య అవసరాల కోసం, గృహ నిర్మాణం కొరకు, పిల్లల చదువుకు, వివాహాలకు, ఇతరత్రా అవసరాలకు పొదుపు చేసుకునే జి పి ఎఫ్, టి ఎస్ జి ఎల్ ఐ నుండి లోన్లు, తీసుకోవాలనుకున్న నెలల తరబడి జాప్యం జరిగి సరైన సమయంలో సొమ్ము అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెల్త్ కార్డులు సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదు. ఉద్యోగులు తమ చేతి నుండి లక్షల రూపాయలు నేరుగా చెల్లించి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వారి మెడికల్ బిల్లు కూడా సంత్సరకాలంగా చెల్లించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతీ నెల జీతాలు ఆలస్యం కావడం వల్ల ఇంటి రుణాలు,విద్యా రుణాల ఈ.యం. ఐ లు కూడా కట్టడం ఆలస్యం కావడం వల్ల పెనాల్టీ లు పడుతూ వున్నాయి.కొన్ని ఆసుపత్రులు నగతు రహిత వైద్యం ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులకు వివిధ వ్యాధులకు శస్త్ర చికిత్సలు చేయాల్సి వున్న వారు నిరాకరణ చేస్తూ వున్నారు.నగదు రూపంలో చెల్లించి రీ ఎంబర్సేమెంట్ కి ధరకాస్తు చేసిన బడ్జెట్ కారణం వల్ల ఏళ్ల తరబడి పెండింగ్ లో వుంటూ వున్నాయి.

- Advertisement -

వైద్య అనారోగ్య కారణాల చేత సెలవులో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన బిల్లులు కూడా మంజూరు కావడం లేదు. జీతాలు కూడా రోజుకు రెండు, మూడు జిల్లాల చొప్పున నెలలో పది హేను రోజుల పాటు చెల్లిస్తున్నారు. రెగ్యులర్ జీతాలు సక్రమంగా అందక సప్లిమెంటరీ బిల్లలు నెలల తరబడి పెండింగ్ లో ఉండటం మూలాన ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. జాప్యాన్ని నివారించాలి. హెల్త్ కార్డులు అన్ని వ్యాధులకు, అన్ని ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. తమ ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేసిన సొమ్ములను వెంటనే మంజూరు చేయాలి. ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రతీ నెల ఒకటవ తేదీన వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వము స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయులకు వున్న పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆ వర్గాలు డిమాండ్ చేస్తూ వున్నాయి.రాష్ట్ర ముఖ్య మంత్రి గతం లో మాదిరిగా ప్రతీ నెల ఒకటవ తేదీన వేతనాలు చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలి.పెండింగ్ బిల్లులు కూడా మంజూరు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఉపాధ్యాయ,ఉద్యోగ వర్గం కోరుతూ వుంది.

  • కామిడి సతీష్ రెడ్డి జయశంకర్
    భూపాలపల్లి జిల్లా 9848445134.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు