Saturday, May 4, 2024

పఠాన్ చెరు ఎమ్మెల్యే ఇంట విషాదం..

తప్పక చదవండి
  • అనారోగ్యంతో కన్నుమూసిన ఎమ్మెల్యే పెద్ద కుమారుడు..
  • గత కొద్ది రోజులుగా జాండిస్ తో బాధపడుతూ చికిత్స..
  • ఎమ్మెల్యేకు సానుభూతి, దైర్యం చెప్పిన పలువురు నాయకులు,
    సన్నిహితులు, బంధువులు..

పఠాన్ చెరు బీ.ఆర్.ఎస్. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది.. ఆయన పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో కన్ను మూశారు.. విష్ణువర్ధన్ గత కొద్దీ రోజులుగా జాండిస్ తో బాధపడుతూ కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.. కాగా పరిస్థితి విషమించడంతో ఆయన నేటి ఉదయం 5 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు.. దీంతో ఆయన కుటుంబసభ్యులు షాక్ కి గురైయ్యారు.. విష్ణువర్ధన్ మరణవార్త తెలుసుకున్న బీ.ఆర్.ఎస్. శ్రేణులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ధైర్యం చెబుతున్నారు.. తమ ప్రగాఢ సానుభోతిని తెలియజేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు