Saturday, July 27, 2024

మంత్రి సబితాను కలిసిన ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు..

తప్పక చదవండి

హైదరాబాద్ ; ఉస్మానియా విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.. వారికి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులను జీఓ నెంబర్ 16 ప్రకారంగా.. మమ్ములను కూడా రెగ్యులరైజ్ చేయాలని వినతి పత్రం అందజేసి విషయాన్ని వారికి క్లుప్తంగా వివరించడం జరిగింది.. దీనికి విద్యాశాఖ మంత్రి సానుకూలంగా స్పందిస్తూ.. ఈ విషయాన్ని నేను మన తెలంగాణ రాష్ట్ర సీఎం దృష్టికి తీసుకుపోతానని హామీ ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘ నాయకులు ఎడ్ల అంజయ్య, వీరేశం, రాము, అభిలాష్, అరుణ్, చేతన్, చరణ్ సింగ్, మెహర్, మల్లేష్, నర్సింగ్ యాదవ్, గౌతమ్, సురేష్, రాజశ్రీ, సతీష్, రామకృష్ణ, అలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు