Friday, May 17, 2024

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి

తప్పక చదవండి
  • ముదిరాజులకు క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టం..
  • ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహన..
  • నాచారం దేవాలయ మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి

గజ్వేల్, ముదిరాజుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు వదిలి పెట్టమని నాచారం దేవాలయమాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి హెచ్చరించారు. ఆదివారం ప్రజ్ఞాపూర్ లోపాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మకు చెప్పలదండ వేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజ్ఞాపూర్ లో జాతీయ రహదారిపై దిష్టిబొమ్మతో నిరసన వ్యక్తం చేసిచెప్పులతో కొట్టి దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతు ముదిరాజ్ కులానికి క్షమాపణ చెప్పాలని, ప్రజా క్షేత్రంలో ఉన్న మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదని, గౌరవప్రదమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం, ఇంతవరకు సమంజసం అని ఆత్మ పరిశీలన చేసుకోవాలని వారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ బంగారు తెలంగాణ సాధించే క్రమంలో పని చేస్తుంటే మీరు ఆయన ప్రభుత్వంలో ఉండి ఒకే కులాన్ని దూషించడం, కులం పేరుతో దూషించడం మేం ప్రశ్నిస్తున్నామని వారన్నారు. మీరు మాట్లాడిన మాటలకు మాత్మ గౌరవం దెబ్బతిన్నదని వారన్నారు. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ దృష్టికి, మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి మీ మీద చర్య తీసుకుంటామని ఖబర్దార్ కౌశిక్ రెడ్డి అని హెచ్చరించారు. ,కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రొట్టెల
శ్రీనివాస్, కోశాధికారి శ్రీరామ్ కృష్ణ, తునికి నర్సింలు, తలారి బిక్షపతి, ఏఎంసి డైరెక్టర్ గణేష్, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఎలా వెంకటేష్, సత్యనారాయణ, ఎల్లేశం కదుల్ల, కదుల్ల దేవేందర్, ఎల్లా శ్రీనివాస్, శ్రీరామ్ శ్రీనివాస్, పూదరి కుమార్, కుమార్, బోయిని రాజు, బెదరమైన బిక్షపతి, ఎల్ల మల్లేశం, కదుల
యాదయ్య, ఎల్లా శివరాములు, కాటు కళ్యాణ్, శ్రీరామ్ నాగేష్, కార్తీక్, రొట్టెల రవి, పూదరి ప్రవీణ్, ఎల్ల మధు, గుర్రాల కార్తీక్, పూదరి వెంకటేష్, వినయ్, శ్రీరామ మల్లేశం, కదుల రామరాజు, ఉడుగుల నవీన్ కుమార్, రొట్టెల మల్లేశం, ఎల్ల, నరేష్ తదితరులు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు