సూర్యపేట : ఈ నెల 24 న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న మెడికల్ కళాశాల నూతన భవనం తో పాటు ఎస్ టి పి ప్లాంట్ ను సోమవారం ఉదయం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సందర్శించారు. బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో జరుగుతున్న పనులను ఆయన పర్యవేక్షించారు.మంత్రి జగదీష్ రెడ్డి వెంట రాజ్యసభ సభ్యులు, బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పేరు మల అన్నపూర్ణ శ్రీనివాస్,జూలకంటి జీవన్ రెడ్డి, సంజీవ నాయక్ తదితరులు పాల్గొన్నారు.