- తెలంగాణలో మనదే అధికారం.
- పంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి.
- సీఎల్పీ నేత మధుర ఎమ్మెల్యే బట్టి విక్రమార్క..
- బట్టికి మధిర నియోజవర్గంలో ఘనస్వాగతం.
ఎర్రుపాలెం : కేవలం నాలుగు నెలలు మాత్రమే ఓపిక పట్టండి మీ సమస్యలన్నీ అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక తీరుస్తుందనీ సీఎల్పీ నేత మధిర ఎమ్మెల్యే బట్టి విక్రమార్క అన్నారు. సోమవారం నాడు మధిర నియోజవర్గంలో పర్యటించారు.పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అనంతరం తొలిసారి ఖమ్మం జిల్లాలోని మధిర నియోజక వర్గానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వచ్చారు.ఆయనకు ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మండల శివారులో మహిళలు హారతులు పట్టారు. యువజన కాంగ్రెస్ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.స్వయంగా బైక్ నడుపుతూ కాంగ్రెస్ శ్రేణులను భట్టి విక్రమార్క ఉత్సాహపరిచారు. ఎర్రుపాలెం మండలంలో జరుగుతున్న పంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సమస్యలను తీర్చకుంటే నాలుగు నెలలు ఓపిక పట్టాలని, తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అన్నారు. వారి డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పారు.కనీస వేతనం ఇవ్వాలని, పని సమయాలు కూడా తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని భట్టి విక్రమార్క చెప్పారు. తాను పాదయాత్ర చేస్తూ రాష్ట్రం మొత్తం దారి పొడువునా చాలా సమస్యలు చూస్తూ వచ్చానని తెలిపారు. పంచాయతీ కార్మికులు 12రోజులుగా మీరు చేస్తున్నారని, వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని చెప్పారు.తాను చాలా సమస్యల మీద అసెంబ్లీ వేదికగా ప్రస్తావించానని భట్టి విక్రమార్క తెలిపారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. సమస్యల మీద, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పారు.
తప్పక చదవండి
-Advertisement-