Sunday, May 5, 2024

మల్కాజ్‌గిరి ఎంపీ మిస్సింగ్..

తప్పక చదవండి
  • కలకలం సృష్టిస్తున్న పోస్టర్లు..
  • 2020లో వరదలు వచ్చినప్పుడు రేవంత్ రాలేదు
  • 2023లో వరదలు వచ్చినప్పుడు కూడా రాలేదు
  • ఎంపీ రేవంత్ పై వెలసిన పోస్టర్లపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ

మల్కాజ్‌గిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కనబడటం లేదని నియోజకవర్గంలో పోస్టర్లు వెలువడటం హాట్ టాపిక్ గా మారింది. 2020లో వరదలు వచ్చినప్పుడు రేవంత్ రాలేదని.. ఇప్పుడు 2023లో వరదలు వచ్చినప్పుడు రేవంత్ రాలేదని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ పై వెలసిన పోస్టర్లపై తీవ్ర చర్చ జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో వరదలకు ప్రతి కుటుంబానికి 10వేలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిరసనలు చేస్తుంటే.. ఒక ఎంపీగా గెలిచిన రేవంత్ నియోజవర్గానికి వచ్చారా..? అంటూ మల్కాజ్‌గిరి అంతటా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ పోస్టర్లు పెట్టడం ఆసక్తిగా మారింది.రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు.. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి ప్రభావంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే, రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఉంటూ నియోజవర్గానికి రాకపోవడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు.అయితే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విపక్షాలు విమర్శలు మాని ప్రజలకు సహాయం చెయ్యాలని కౌంటర్ ఇవ్వడం.. ఆ వెంటనే పోస్టర్లు వెలవడం పట్ల బిఆర్ఎస్ పాత్ర ఉందంటూ కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా మా నాయకుడు కనపడటం లేదు.. అనే పోస్టర్లు వెలువడటం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపింగ్ గా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు