Saturday, May 4, 2024

లచ్ఛకు సవాలక్ష..

తప్పక చదవండి
  • క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ల జారీలో సహకరించని సాంకేతికత..
  • ఉస్సూరుమంటూ రోడ్లపైనే బైఠాయించిన సామాన్యులు..
  • నిన్నటితో ముగియనున్న రూ.లక్ష సాయానికి దరఖాస్తు గడువు..
  • ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తామని అధికారుల వెల్లడి..
  • లబ్ధిదారులకు జులై 15వ తేదీన చెక్కుల పంపిణీ..
  • బీసీ రుణాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని వ్యాఖ్య..
  • దరఖాస్తు గడువు పెంపుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి గంగుల..

హైదరాబాద్, తెలంగాణలో కులవృత్తులు, చేతివృత్తులు చేస్తున్న వెనుకబడిన వర్గాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు.. సర్కారు ప్రకటించిన రూ.లక్ష సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు సమయం మంగళవారంతో ముగిసింది.. అయితే.. నిన్నటి వరకు సుమారు 3 లక్షలకు పైగా బీసీలు ఇందుకోసం దరఖాస్తు చేసుకోగా.. ఇంకా చాలా మంది చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే.. దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన క్యాస్ట్, ఇన్‌కం సర్టిఫికేట్ల జారీలో జాప్యం జరుతుండటం వల్ల.. ప్రజలంతా ఎమ్మార్వో ఆఫీసుల్లోనే రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వచ్చింది. అందులో మొదటి రోజు వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవటం.. తర్వాత సర్టిఫికేట్ల జారీకి సర్వర్ ఓపెన్ కాకపోవటంతో.. చాలా వరకు దరఖాస్తులు పెండింగ్‌ ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దరఖాస్తు గడువు పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. ఈ అంశంపై మంత్రి గంగుల కమలాకర్ కీలక ప్రకటన చేశారు.

బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం దరఖాస్తుల గడువు పెంచటం లేదని మంత్రి గంగుల స్పష్టం చేశారు. నిన్నటి వరకు వచ్చిన దరఖాస్తులనే పరిశీలిస్తామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు జులై 15న చెక్కులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. అయితే.. బీసీ రుణాల పంపిణీ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని.. ప్రతీ నెల చెక్కులు పంపిణీ చేస్తామని తెలిపారు. అయితే.. దరఖాస్తు చేసుకోలేకపోయిన వాళ్లు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని.. మరో విడతలో.. దరఖాస్తులు తీసుకుంటామని మంత్రి గంగుల స్పష్టం చేశారు. అయితే.. ఇప్పటికే పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకోగా.. వాటన్నింటినీ వెరిఫై చేసి.. జులై 15 నుంచి అర్హులైన వారికి చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి గంగుల తెలిపారు. ప్రతీ నెల 5 వ తేదీ వరకు కలెక్టర్లు అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపిస్తారని.. దాన్ని ఇంఛార్జ్ మంత్రి వెరిఫై చేస్తారని.. 15 వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేలు చెక్కులు స్వయంగా పంపిణీ చేస్తారని చెప్పుకొచ్చారు మంత్రి గంగుల. చెక్కులు ఇచ్చిన నెల రోజుల్లోపు లబ్ధిదారులు.. పనిముట్లు కొనుక్కోవాలని.. వాటితో ఫొటోలు దిగి పంపిస్తే.. వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని చెప్పుకొచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు