Sunday, May 19, 2024

విండీస్‌తో వందో టెస్ట్‌ సెంచరీ బాదిన కోహ్లీ

తప్పక చదవండి
  • 500వ మ్యాచ్‌లో వంద కొట్టిన తొలి క్రికెటర్‌గా రికార్డు
    ట్రినిడాడ్‌ : భారత జట్టు స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐదొందల అంతర్జాతీయ మ్యాచ్‌లో శతకం సాధించాడు. విండీస్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌ వందో టెస్ట్‌ మ్యాచ్‌ కావడం…కోహ్లీ శతకం బాదడంతో రికార్డులు అతని వశమయ్యాయి. చారిత్రాత్మక మ్యాచ్‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లీ షానన్‌ గాబ్రియేల్‌ ఓవర్లో బౌండరీ కొట్టి సెంచరీకి చేరువయ్యాడు. 180 బంతుల్లో 10 ఫోర్లతో కింగ్‌ కోహ్లీ శతకం పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతడు మూడంకెల స్కోర్‌ చేయడం ఇది 29వసారి. దాంతో 500వ మ్యాచ్‌లో వంద కొట్టిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు సచిన్‌ టెండూల్కర్‌ (664), ధోనీ (538), రాహుల్‌ ద్రావిడ్‌ (509) వంటి ఆటగాళ్లు 500పైగా మ్యాచులు ఆడినా.. వారెవరూ 500వ మ్యాచ్‌లో సెంచరీ చేయలేకపో యారు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 87 పరుగులతో క్రీజులోకి వచ్చిన విరాట్‌ ధాటిగా ఆడాడు. అందరూ ఊహించనట్టే సెంచరీ కొట్టాడు. మరోవైపు రవీంద్ర జడేజా(50) కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్‌..317/4. వీళ్లిద్దరూ ధాటిగా ఆడుతుండడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిం డియా భారీ స్కోర్‌ దిశగా పయనిస్తోంది. తొలి టెస్టులో గెలిచిన భారత జట్టు 1`0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు