మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సిద్ధమైంది. ఈ మేరకు ఝార్ఖండ్ సీఎం సోరెన్కు సమన్లు జారీ చేసింది.
వచ్చే వారం రాంచీలోని ఈడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సోరెన్ స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉందని తెలిపారు. అయితే, ఏ కేసులో సోరెన్కు సమన్లు పంపించారనే విషయం తెలియలేదు. అక్రమ మైనింగ్కు సంబంధించిన కేసులో సోరెన్కు గతేడాది ఈడీ సమన్లు ఇచ్చింది. మైనింగ్ విషయంలో జరిగిన అవకతవకలపై ఆయన్ను ప్రశ్నించింది.
తప్పక చదవండి
-Advertisement-