Monday, May 13, 2024

జగన్‌ మూర్ఖానికి మూల్యం చెల్లించుకున్న ఎపి

తప్పక చదవండి
  • అమరావతిని దెబ్బతీయడంతో ఆగిన అభివృద్ది
  • పోలవరం ఆలస్యం కావడంతో వెనక్కి పోయిన పురోగతి
  • రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయ అడుగులు
  • మీడియాతో చిట్‌చాట్‌లో చంద్రబాబు ఆవేదన
    అమరావతి : సీఎం జగన్‌ ఒక మూర్ఖడని.. రాజధాని అమరావతిని చంపేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అమరావతి ఉండి ఉంటే చాలా అద్భుతమైన నగరంగా ఉండేదన్నారు. హైదరాబాద్‌ను ఆనాడు అభివృద్ధి చేసానని.. ఈ రోజు అది మహనగరంగా మారిందని చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విూడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం పూర్తి అయితే దక్షిణ భారత దేశంలో నెంబర్‌ వన్‌ అయ్యేదన్నారు. సంపద సృష్టించే అమరావతిని జగన్‌ చంపేశారు .. ఒకరి మూర్ఖత్వానికిపిచ్చితనానికి రాష్ట్రం బలికావాలా? అని ప్రశ్నించారు.అమరావతిని రాజధానిగా ప్రకటించకముందు అక్కడ భూమి ధరెంత? రాజధానిగా కొనసాగి ఉంటే ఎంత ఉండేదో ఎవరైనా బేరీజు వేశారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జీవనాడి పోలవరాన్ని ముంచేస్తే, ప్రజల్లో చైతన్యం ఏమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాగోదావరితో రెండు రాష్టాల్ల్రో ప్రతి ఎకరాకు నీళ్లివ్వొచ్చు ? భూ కబ్జాలు, సెటిల్‌ మెంట్లతో వేలకోట్లు దోచేశారు. రైతులు కోలుకోలేని దుస్థితిలో ఉన్నారు.. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గితే ఏపీలో పెరుగుతున్నాయి. కౌలు రైతులు పూర్తిగా నాశనమయ్యారని ఆరోపించారు. జగన్‌ మూర్ఖత్వానికి ఒక జాతి మొత్తం బలి అవ్వాలా అని ప్రశ్నించారు. జగన్‌ లాంటి వాడిని తన జీవితంలో ఎప్పుడు చూడలేదన్నారు. భూముల సెటిల్‌మెంట్లు చేసి వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఋషికొండను కొట్టేసి బొడిగుండు చేశారన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్‌ 2లో ఉందన్నారు. కౌలు రైతులు పూర్తిగా నాశనము అయ్యారని తెలిపారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో పవర్‌ సెక్టార్‌లో రిఫార్మ్స్‌ తీసుకువచ్చి విజయం సాధించా మన్నారు. భవిష్యత్‌లో ఫ్యూయల్‌, ఎనర్జీ సెక్టార్స్‌పై ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందన్నారు. సోలార్‌, విండ్‌, ఎనర్జీ సెక్టార్స్‌కు మంచి భవిషత్తు ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఎలక్షన్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ అన్ని వర్గాలను ఆకటుకుంటోందని అన్నారు. స్త్రీ శక్తి , యువత దేశ వ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. భారత్‌ మినహా ప్రపంచ వ్యాప్తంగా యువత జనాభా తగ్గిపోతోం దన్నారు. భారత్‌లో యువత జనాభా 2040 వరకు ఇబ్బంది లేదన్నారు. తల్లికి వందనం, ఆడ్డబిడ్డ నిధి, మహిళకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్‌ మహిళల్లో ఆత్మగౌరవం నిలిపేందుకే ఈ పథకలు అని చెప్పుకొచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా తెలంగాణలో ఎకరా అమ్మితే.. ఆంధ్రాలో 100 ఎకరాలు కొనవచ్చు అని చెబుతున్నారని బాబు తెలిపారు. నేను ఆ రోజు టెక్నాలజీ అంటే నన్ను అందరూ ఎగతాళి చేశారు. ఈ రోజు అదే టెక్నాలజీ అందరికీ ఉపయోగ పడుతుందని అన్నారు. యువత శక్తిని ఉపయోగించి వారిని ముందుకు నడిపిస్తాం. కియా మోటార్స్‌ కేవలం క్రిడిబిలిటి వల్లనే వచ్చిందని.. ఐదేళ్లలో జగన్‌ ఒక బిల్డింగ్‌ కూడా కట్టలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని వనరులు ఏపీలోనే ఉన్నాయన్నారు. పట్టిసీమ కడితే ఆనాడు ఎగతాళి చేశారని… మరి ఈ రోజు పట్టిసీమ లేకపోతే ఈ ప్రభుత్వం ఏం చేసేదని ప్రశ్నించారు. పోలవరాన్ని నేడు జగన్‌ ముంచేశారని విమర్శించారు. ప్రజలు ఇంకా చైతన్య వంతులు కావాలని పిలుపునిచ్చారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని… అప్పటి వరకు వారికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. టిడిపి,జనసేనతో కలిసి బిజెపిపోటీ చేస్తుందని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపైనా చంద్రబాబు స్పందించారు. ఎవరెవరో మాట్లాడిన వాటిపై స్పందించి చులకన కాదల్చుకోలేదు. దగాపడ్డ ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే ఇప్పుడు నాకు ముఖ్యం. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే నా లక్ష్యం. పెద్ద బాధ్యత నాపై ఉన్నప్పుడు పెద్ద ఆలోచనలూ అవసరం. పోరాడితే కేంద్రం దిగొస్తుందనడానికి జల్లికట్టు ఘటనే ఉదాహరణ. ఓట్ల అవకతవకలపై దిల్లీని కూడా వదిలిపెట్టబోం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పొత్తుల గురించి అందరూ మాట్లాడుతున్నారని.. తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు కునే విధంగా ఉంటుందని ప్రకటించారు. అన్ని ఆలోచించి రాష్టాన్రికి మంచి జరిగే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేసారు. మినీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్‌ 6 హావిూలు అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా చేశామని.. ఇండియా జనాభాలో యువత ఎక్కువ.. రానున్న రోజుల్లో మిగతా దేశాల కంటే ఇండియా యువ భారత్‌ గా ఉంటుందన్నారు. చైనా అప్పట్లో తీసుకున్న విధానం వల్ల ఇప్పుడు సంపద ఉన్నా జనాభా పరంగా చైనా ఇబ్బంది పడుతోంది .. మనం కూడా జనాభా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లల్ని బాగా చదివిస్తే వారు ప్రపంచానికి ఆస్తి అవుతారన్నారు. అందుకోసమే మేం తల్లికి వందనం కార్యక్రమం తీసుకు వచ్చాం తల్లికి, పిల్లలకు మధ్య అనుబంధాన్ని పెంచడానికి ఉపయోగ పడుతుందన్నారు. పూర్‌ టు రిచ్‌ అర్థం చేసుకోవడ కష్టమే..కానీ కష్టపడితే అద్భుత ఫలితాలు సాధ్యమని అన్నారు. మినీ మేనిఫెస్టోలో పెట్టిన పూర్‌ టు రిచ్‌ విధానం వినూత్నమైందని..ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యమే పీ4 విధానం అని వివరించారు. పేదలకు ఇప్పుడు రోజుకు రూ.150 మాత్రమే వస్తోందని.. సంపద సృష్టి ద్వారా పేదరికం పోగొట్టాల్సి ఉందన్నారు. పూర్‌ టు రిచ్‌ అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కానీ.. కష్టమైన ఆచరణలో అద్భుత ఫలితం ఇస్తుంది ఇస్తుందన్నారు. మహిళలకు ఇప్పటివరకు 4 పథకాలే ప్రకటించాం..మహిళలకు వీలైనన్ని ఎక్కువ పథకాలకోసం ఆలోచిస్తున్నామన్నారు. మహిళల భాగస్వామ్యం తో కుటుంబం .. సమాజం బాగుపడేలా చూస్తామన్నారు. కట్టెల పొయ్యిపై మా అమ్మ పడిన కష్టాలు ఎన్నో చూశా.. మా అమ్మ కష్టాలు చూసే ఆనాడు దీపం పథకాన్ని తీసుకొచ్చామన్నారు.పెరిగిన ధరలతో మళ్లీ కట్టెల పొయ్యికి పరిమితమయ్యేలా ఉన్నారు అందుకే ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. మహిళా శక్తి అనేది ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోందని.. అమెరికాకు ఇప్పటివరకూ మహిళా అధ్యక్షురాలు కాలేదన్నారు. మినీ మేనిఫెస్టో మహాశక్తి పేరిట మహిళలకు ప్రాధాన్యమిచ్చామన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు