- బెదిరింపు కాల్తో ఉద్యోగులు పరుగు..
- ఫేక్ కాల్గా తేల్చిన పోలీసులు..
హైదరాబాద్, 12 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
హైదరాబాద్ నాంపల్లిలోని ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్లో బాంబు ఉన్నట్లుగా ఓ కాల్ రావటం కలకలం రేపింది. కార్యాలయంలో బాంబ్ ఉందని మరికొద్ది క్షణాల్లో పేలుతుందని ఆగంతకుడు డయల్ 100కు కాల్ చేశాడు. వెంటనే కంట్రోల్ రూం సిబ్బంది స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కార్యాలయ అధికారులు, సిబ్బంది భయభ్రాంతులకుగురై వెంటనే ఆఫీస్ నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసులు కార్యాలయానికి చేరుకొని బాంబ్ స్కాడ్తో అనువణువూ తనిఖీ చేశారు. కార్యాలయ సిబ్బందిని మెుత్తం బయటకు పంపించేసి సోదాలు చేసారు. అయితే బాంబ్ లేదని తేలటంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం యథావిధిగా విధుల్లో నిమగ్నమైపోయారు. అయితే బాంబు ఉన్నట్లుగా వచ్చిన కాల్ ఒక ఫేక్ కాల్గా పోలీసులు గుర్తించారు. బాంబు ఉన్నట్లుగా కాల్ చేసింది ఎవరు ? ఎందుకు చేశారు ? ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తప్పక చదవండి
-Advertisement-