- బోయిన్ పల్లి పద్మా నగర్ – 2 రింగ్ రోడ్ ప్రాంతంలో కార్యక్రమం..
- దివ్య సందేశం అందించిన అమర లింగన్న..
హైదరాబాద్ : మంగళవారం రోజు బోయిన్ పల్లి, బాగ్ చింతల్, పద్మా నగర్ -2 రింగు రోడ్డు ప్రాంతంలో 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం అంగరంగ వైభవముగా జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి సుమారు 250 మంది భక్తులు పాల్గొన్నారు, ఉ : 7:00 గంటలకు పురవీధుల గుండా నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో బస్తీ పెద్దలు పాల్గొన్నారు ముఖ్య వక్తగా అమర లింగన్న సందేశం ఇచ్చారు. మధ్యాహ్నం భోజనంతో కార్యక్రమం ముగిసింది.