- ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి..
- మౌలిక వసతులు కల్పించాలి..
- డిమాండ్ చేసిన ఏబీవీపీ, కోఠి జిల్లా కన్వీనర్, సభావట్ కళ్యాణ్..
హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
గురువారం రోజు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఏబీవీపీ, కోఠి జిల్లా కన్వీనర్, సభావట్ కళ్యాణ్.. ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని.. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలనీ.. మౌలిక వసతులు కల్పించాలని, వెంటనే పుస్తకాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ డీఈఓ కార్యాలయం ముందు శాంతియుతంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్ట్ చేసి ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తప్పక చదవండి
-Advertisement-