Monday, April 29, 2024

ఏపీ విద్యార్థులకు శుభవార్త.. !

తప్పక చదవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిపూట బడులను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేశ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని బోర్డుల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలు ఈ ఆదేశాలు పాటించాలని సూచించారు. ఉదయం 7: 30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని సూచించారు. ఉదయం 8:30 గంటల నుంచి 9 గంటల వరకు రాగిజావ పంపిణీ, ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు