Friday, April 26, 2024

కృష్ణాన‌దిలో ఈత‌కు వెళ్లి న‌లుగురు చిన్నారులు మృతి..

తప్పక చదవండి

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో విషాదం నెల‌కొంది. కృష్ణా న‌దిలో ఈత‌కు వెళ్లి న‌లుగురు చిన్నారులు మృతి చెందారు. అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గం ఇటిక్యాల మండ‌లం మంగ‌పేట వ‌ద్ద కృష్ణా న‌దిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృతదేహాల‌ను బ‌య‌ట‌కు వెలికితీశారు. మృతుల‌ను అఫ్రీన్(17), సమీర్ (8), నౌషిన్(7), రిహన్(15)గా పోలీసులు గుర్తించారు. కృష్ణానదిని చూడడానికి ఆటోలో 11 మంది వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో న‌లుగురు ఈత‌కు దిగి మృత్యువాత ప‌డ్డారు. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు చిన్నారులు చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల‌ను ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు