Monday, April 29, 2024

శ్రీశైల గోసంరక్షణ శాలను పరిశీలించిన పశువైద్యాధికారులు!

తప్పక చదవండి

శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ శాలను సోమవారం పశు వైద్య నిపుణులు పరిశీలించారు. ఆత్మకూరు ఏరియా పశు వైద్యశాల ఇన్‌చార్జి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఈ అరుణ, వెలుగోడు ఏరియా పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సీ ధనుంజయ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు డాక్టర్ ఎం రాం సింగ్ (సున్నిపెంట), డాక్టర్ కే అశోక్ కుమార్ (దుద్యాల), డాక్టర్ బీ భువనేశ్వరి (కొత్తపల్లి), బీ మురళీక్రుష్ణ (జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ సున్నిపెంట) తదితరులు దేవస్థానం గో సంరక్షణశాలను సందర్శించారు. గోసంరక్షణ శాలలోని గోవులకు పశు వైద్య నిపుణులు తగు వైద్య పరీక్షలు చేశారు. గోవులకు పౌష్టికాహారం పంపిణీ, సీజనల్ వ్యాధులను నిరోధించడానికి ముందస్తుగా గోవులకు వేయాల్సిన టీకా మందులు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.

ఇప్పటికే గోవులకు పౌష్టికాహారం పంపిణీలో భాగంగా దాణా, పచ్చగడ్డి, ఎండుగడ్డి తదితరాలు అందిస్తున్నారు. గోవుల్లో వచ్చే సీజనల్ వ్యాధులైన గొంతువాపు వ్యాధి, జబ్బ వ్యాధులు రాకుండా హెచ్ఎస్బీ క్యూ టీకాలు వేస్తున్నారు. గత నెల 25, 26 తేదీల్లో కూడా గోవులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో గో సంరక్షణ శాఖ సహాయ కార్యనిర్వహణాధికారి ఏకే ధనపాల్, గో సంరక్షణశాల పర్యవేక్షకులు బీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం దేవస్థానం పరిధిలోని హేమారెడ్డి మల్లమ్మ మందిరం ఎదురుగా చేపట్టిన సప్త గోకులం, గణేశ సదనం, ధర్మకాట, శ్రీశైల ప్రాజెక్టు కాలనీలో వసతి గృహాల నిర్మాణ పనులను ఈఓ లవన్న ఆధ్వర్యంలో దేవస్థానం అధికారులు పరిశీలించారు. సంబంధిత ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి లవన్న ఆయా పనుల పురోగతిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద సుమారు 40 అడుగుల విస్తీర్ణంలో సర్కిల్‌గా సప్త గోకులం నిర్మిస్తున్నారు. ఈ సప్త గోకులం నిర్మాణానికి దాతలు సహకారం అందిస్తున్నారు.

- Advertisement -

గోవులు సులభంగా మేత మేయడానికి, నీరు తాగడానికి వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఈఓ లవన్న ఆదేశాలు జారీ చేశారు. గోవును సౌకర్యవంతంగా భక్తులు పూజించేలా సప్త గోకులాన్ని తీర్చి దిద్దాలని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు