Saturday, July 27, 2024

భార్యను,అత్తను దారుణంగా చంపిన అల్లుడు..

తప్పక చదవండి

మరో గ్రామంలో కాపురం పెడుదామని కోరినా వినకుండా ఘర్షణ పడుతున్న భార్యను, అత్తను దారుణంగా చంపిన అల్లుడు ఉదంతం కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కౌతాలం మండలం బాపురం గ్రామానికి చెందిన మహాదేవి(25) అనే వివాహితకు కర్ణాటక రాష్ట్రం టెక్కలికోటకు చెందిన బోయ రమేశ్‌తో నెల రోజుల క్రితం రెండో వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత టెక్కలికోటలోనే కాపురం పెడుదామని భర్త రమేశ్‌ భార్య మహాదేవికి చెప్పాడు. ఇదే విషయంలో గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య తరుచూ వాగ్వాదం జరుగుతుంది. శనివారం అర్ధరాత్రి కూడా ఇద్దరు గొడవ పడ్డారు. దీంతో ఆవేశానికి లోనైన భర్త రమేశ్‌ భార్య మహాదేవిని , అత్త హనుమంతమ్మను కర్రతో దారుణంగా కొట్టి చంపాడు. స్థానికులు సమాచారం అందించడంతో హనుమంతమ్మ సోదరుడు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లి, కూతుళ్ల మృతదేహాలను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు