మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో అరుదైన గౌరవాన్ని కూడా సొంతం చేసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసాను మెగాస్టార్ అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తూ ఉంది. అందిస్తుంది. తాజాగా దీన్ని చిరంజీవికి కూడా అందించింది. దీంతో అభిమానులు చిరుకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇక ఇప్పటికే ఈ వీసా అందుకున్న సినీ ప్రముఖుల లిస్ట్లో మెగాస్టార్ కూడా చేరారు. రజనీకాంత్, షారుక్ ఖాన్, మోహన్లాల్, మమ్ముట్టి, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, టొవినో థామస్ వంటి పలువురికీ ఇప్పటికీ ఈ వీసా దక్కింది. పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను ఇస్తూ ఉంటుంది.