సర్వే ఇన్ఛార్జ్, సర్వేయర్ పోస్టుల భర్తీకి రాజస్థాన్ జైపూర్లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3444 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల విధానం ఆన్లైన్లో ఉండగా.. జూలై 05 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 3444.. పోస్టులు : 1. సర్వే ఇన్ఛార్జ్ – 574 పోస్టులు.. 2- సర్వేయర్ – 2870 పోస్టులు.. అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంపిక : ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు : ఆన్లైన్లో.. వయస్సు : పోస్టులను బట్టి 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి. జీతం : రూ.20,000 నుంచి రూ.24,000.. చివరి తేది: జూలై 05.. దరఖాస్తు ఫీజు : సర్వే ఇన్ఛార్జ్ (రూ.944), సర్వేయర్ (రూ.826).. వెబ్సైట్ : www.bharatiyapashupalan.com