Saturday, July 27, 2024

దీక్షా శిభిరంలో మహిళా నేత మృతి..

తప్పక చదవండి
  • చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కాకినాడలో టీడీపీ దీక్షా శిభిరం..

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా కాకినాడలో నిర్వహిస్తున్న టీడీపీ దీక్షా శిబిరంలో విషాదం చోటుచేసుకుంది.. కాకినాడ టీడీపీ మహిళా అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలి పోయారు.. వెంటనే ఆమెను జీజీహెచ్ కు తరలించారు.. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.. కాగా సత్యవతి కొన్నాళ్లుగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.. సత్యవతి మృతితో విషాదకర వాతావరణం నెలకొంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు