Thursday, April 25, 2024

ఏపీలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పర్మినెంట్..

తప్పక చదవండి

2 జూన్‌ 2014 నాటికి ఐదేండ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రివర్గ సమావేశానంతరం పీఆర్సీపైనా ప్రకటన చేస్తారు. ఏపీ సచివాలయంలో మంత్రుల కమిటీతో సోమవారం ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. రెవెన్యూ, సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఎన్జీవో ఉపాధ్యాయ సంఘాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12వ వేతన సవరణ సంఘంపైనా చర్చించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు