Saturday, May 18, 2024

ఆదివాసుల్లో అమృత వెలుగులు నింపాలి..

తప్పక చదవండి

ఆధునిక సామాజిక గతకాలపు ఆనవాళ్లు ఆదివాసులు. సమిష్టి జీవన పద్ధతులు, సహజీవనం, పారదర్శతకు నిలువెత్తు సాక్షులు వారు. కానీ నిత్యం అసౌకర్యాలతో బ్రతుకు పోరాటం చేస్తూ కష్టాల కారడివిలో జీవన పోరాటం చేస్తున్నారు. భారత రాష్ట్రపతి గా గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము గత ఏడాది బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఆదివాసుల సమస్యలపై విస్తృత చర్చ జరుగుతున్నది. కానీ మాటలే తప్ప చేతలు కనబడడం లేదు. స్వాతంత్రం వచ్చి వజ్రోత్సవాలు జరుపుకున్న ఇప్పటికి గిరిజనుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి ప్రతిఏడాది ప్రపంచ ఆదివాసుల దినోత్స వం జరుపుకోవాలని 1994లో ప్రకటించింది.’’స్వీయ భరోసా కోసం సమస్యలను పరిష్కరించే వారిగా స్థానిక యువత ఎదగాలి’’ అనే థీమ్‌తో ఈఏడాది మనదేశంలో ఆదివాసుల దినోత్సవం జరు పుకుంటున్నాం. చట్టాలు ఉన్న కాగితాలకు పరిమితం.. ప్రస్తుతం మనదేశంలో 700పైగా గిరిజన తెగలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కలప్రకారం భారతవనిలో 11కోట్ల మంది గిరిజనులు ఉన్నారు. మొత్తం జనాభాలో వారు 8.6% శాతం. కాని ఆరోగ్యం, సరైన పౌష్టికారం, కనీస మౌలిక వసతులు లేక దుర్భర జీవనం సాగిస్తు న్నారు. ఆదివాసుల అధికంగా గల తూర్పు పశ్చిమ కనుమలు ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, మధ్య భారత దేశంలో అభివృద్ధి ప్రాజె క్టుల పేరుతో వనాల విధ్వంసం నకు పాల్పడడం, ఖనిజాల తవ్వ కాలు ఆదివాసుల జీవనానికి అవరోధా లుగా మారినాయి. గిరిజ నుల సంక్షేమం హక్కుల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలు కాగితాలకు పరిమితం అవుతున్నాయి. ఆదివాసుల ప్రాంతాల పరిపాలన సంక్షేమంపై రాజ్యాంగంలో 5వ,6వ షెడ్యూ లు ఉన్నాయి. ఆదివాసి గ్రామాలకు స్వీయ పరిపాలన హక్కులు కల్పించే విషయంలో పంచాయతీరాజ్‌ షెడ్యూల్‌ ప్రాంతాల విస్తరణ చట్టం (పెసా)-1996 తెచ్చినారు. అలాగే గిరిజనులకు అడవి భూముల హక్కులు కల్పించే విషయం లో కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 ను అమల్లోకి తెచ్చింది. గిరిజన ప్రాంతాలలో భూ బదలాయింపును నిషేధిస్తూ చేసిన 1/70 చట్టం వుంది. కానీ చట్టాలను పక్కగా అమలుపరిచే సమీ కృత గిరిజనాభివృద్ధి సంస్థలు మొద్దు నిద్ర నటిస్తున్నాయి. స్వాతం త్ర అమృత మహోత్సవాలు పూర్తయిన వేళ గిరిజనుల ఆరోగ్యం వారి అభివృద్ధిపై ప్రభుత్వాలు సరైన దృష్టి సారించడం లేదు. గత ఏడాది డిసెంబర్‌ నెలలోజరిగిన పార్లమెంటుసమావేశాల్లో హిమా చల్‌ ప్రదేశ్‌లోని ‘హతి’ కులం వారిని షెడ్యూల్‌ తెగల జాబితాలో చేరుస్తూ పార్లమెంట్‌ఆమోదం తెలిపింది. కులాలచేర్పు తొలగింపు ల విషయంలో శాస్త్రీయత లేకుండా పోతున్నది. ఒకరాష్ట్రంలో ఎస్టీ జాబితాలో ఉన్న వారు మరొక రాష్ట్రంలో ఉండడం లేదు. దీనివల్ల తమ రాష్ట్ర నుంచి వేరే రాష్ట్రాలకు వలస వెళ్లే వారికి కులధ్రువీ కరణ పెద్ద తలనొప్పిగా తయారైంది. కావున గిరిజన ప్రజల జీవి తాల మీద ప్రభావం చూపే ఏవిధానైనా శాస్త్రీ యమైన అధ్యయ నం జరిపిన తర్వాతే సామాజిక కోణంలో పరి శీలన చేసి అమలు పరచాలి. ఆదివాసులస్వయం సమృద్ధికి బాటలుపడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గోండులు, ఖోలాంలు, వరంగల్‌ ఖమ్మం జిల్లాలో కోయలు కొండారెడ్లు నాగర్‌ కర్నూల్‌ నల్గొండ జిల్లాలో చెంచులు నివసిస్తున్నారు. నాయక పోడు, బం జారాలు, యానాదులు, ఎరుకలు ఇతర జిల్లాలో ఉన్నారు. ఇటీవల రాష్ట్రప్ర భుత్వం గిరిజనులకుపొడు భూముల పట్టాలు ఇవ్వ డం ద్వారా వారి అభివృద్ధికి బాటలు పరిచి నది కాని ఇంకా కొన్ని సౌకర్యాలు కల్పిం చాల్సిన అవసరంఉంది. ఆదివాసుల కుటు ంబాల్లో సారా పెద్దసమస్యగా మారింది. పురుషులుసారాకి బానిసై అనారోగ్యం పాలవుతున్నారు. సారా తయారీ సరఫరా నియంత్రణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గిరి జనులకు వైద్య సేవలు అందించడానికి గతంలో సంచార వైద్యశాల వాహ నాలు ఉండేవి. వాటిని పునరుద్ధరించ వలసిన అవసరం ఉంది. అధిక శాతం గిరిజన గూడెల్లో త్రాగు నీటి సౌకర్యం లేదు. మిషన్‌ భగీరథ ద్వారామంచినీటిని అందించాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ ఏరియాగా గుర్తించబడిన ప్రాంతాల్లో 1/70 చట్టం సంపూ ర్ణంగా అమలు కావడం లేదు. ఈ చట్టాన్ని కాపాడాల్సిన సమగ్ర గిరిజన అభివృద్ధిసంస్థలు పట్టించుకోకపోవడంతో గిరిజన ప్రాంతా ల్లో అక్రమార్కులు భూముల క్రయవిక్రయాలు జరుపుతూ అక్రమ నిర్మాణాలుచేపడుతున్నారు.ఈఆక్రమణలను నియంత్రించాల్సిన అవసరం వుంది. చాలా జిల్లాల్లో పొడుగ్రామాల్లో అభివృద్ధి అంతం త మాత్రమే ఉంది. నాడునిజాంప్రభుత్వానికివ్యతిరేకంగా పోరా డిన పోరుగ్రామాలు నేటికీఅసౌకర్యాలతో సహవాసంచేస్తున్నాయి. సరైన రహదారులు పౌష్టికాహారం వైద్యసేవలు లేక మనగడ కోసం నిత్యం పోరాటం కొనసాగిస్తున్నారు. ఆదివాసుల బతుకులు బాగు పరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తన వంతుగా ప్రయ త్నాలు ప్రారంభించాలి. గిరిజనుల స్వయం పాలన విద్య ఆర్థిక సాధికారి కత సాధనకు పాలకులు మరింత చిత్తశుద్ధితో కృషి చేయాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు