Saturday, July 27, 2024

11కేవీ స్తంబాలు ఏర్పాటు చేయాలి…

తప్పక చదవండి
  • భువనగిరి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు పట్నం..

భువనగిరి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ స్తంబల సమస్యలపై భువనగిరి పట్టణ ఇన్చార్జి ఏ.ఈ రవీందర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది…
ఈ సందర్భంగా భువనగిరి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు పట్నం కపిల్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు దగ్గరికి వస్తున సందర్భంగా భువనగిరి పెద్దచెరువు కట్ట పైన 11కే.వి వైర్లు పైకి లేపవలసిందిగా కోరారు. గత సంవత్సరం చాలా ఇబ్బంది జరిగింది అని గుర్తుచేశారు.. ఈ సంవత్సరం భువనగిరి పట్టణ పురవీధుల్లో ఉన్నటువంటి కొన్ని స్తంభాలు ఇబ్బందిగా ఉన్నాయి.. వివిధ సమస్యలను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.. తొందరగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఈ కార్యక్రమంలో భువన గణేష్ ఉత్సవ సమితి సభ్యులు సుర్వి శ్రీనివాస్, దేవరకొండ నరసింహ చారి, గౌలికర్ కిషన్ జి, రాళ్ళబండి కృష్ణచారి, గీత కొండల్, కొలిచేలిమమల్లికార్జున్, నామోజు రాజు, వినోద్, ఈశ్వర్, గిరిధర్, సురేష్, వెంకటరమణ, మల్లేష్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారని భువనగిరి గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి కొలిచెలిమ మల్లికార్జున్ తెలిపారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు