హాకీ మెన్స్ జూనియర్ ఆసియా కప్లో భారత జట్టు ఓటమి అన్నదే లేకుండా విజయాలతో దూసుకుపోతున్నది. ఇప్పటికే ఈ టోర్నీలో చైనీస్ తైపీ, జపాన్ జట్లను భారత్ ఓడించింది. పాకిస్థాన్తో మ్యాచ్ను 1-1 గోల్స్తో డ్రా చేసుకుంది. ఇక ఇప్పుడు పూల్-Aలో భాగంగా జరిగిన ఆఖరి మ్యాచ్లో థాయ్లాండ్ జట్టును చిత్తు చేసింది. ఏకంగా 17-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. థాయ్లాండ్తో మ్యాచ్లో భారత ఆటగాడు అంగద్ బీర్ సింగ్ అత్యధికంగా నాలుగు గోల్స్ సాధించాడు. భారత జట్టు కెప్టెన్ ఉత్తమ్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. కాగా, గత మెన్స్ జూనియర్ ఆసియా కప్లో టైటిల్ నెగ్గిన భారత జట్టు ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగింది. పాకిస్థాన్, జపాన్, చైనీస్ తైపీ, థాయ్లాండ్ జట్లతో కలిపి పూల్-Aలో తలపడింది. తాజాగా థాయ్లాండ్పై విజయంతో అలవోకగా సెమీఫైనల్స్లో అడుగుపెట్టింది.