Sunday, May 19, 2024

రాజదండం చేతబట్టి..

తప్పక చదవండి

  • ప్రధానికి సెంగోల్ ను అందించిన మధురై పీఠాధిపతి. .
  • నేడే కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం..
  • 14 ఆగష్టు 1947 తొలిసారిగా సెంగోల్ అందుకున్న
    స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ..
  • 5 అడుగుల పొడవుతో పైభాగంలో ఎద్దు తల
    చెక్కబడి ఉన్న రాజదండం..

న్యూ ఢిల్లీ, 27 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
బంగారు రాజదండం సెంగోల్ ను ప్రధాని మోదీ అందుకున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మే 27వ తేదీ శనివారం ఢిల్లీలోని తన నివాసంలో మదురై పీఠాధిపతి అధినంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మదురై అధీనం 293వ ప్రధాన పూజారి ప్రధాని మోదీకి సెంగోల్‌ను బహుకరించారు. తిరువావడుతురై అధినం చెన్నై నుంచి మే 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం మోదీకి సెంగోల్ ను బహూకరించారు.

- Advertisement -

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ స్పీకర్ సీటు దగ్గర ‘సెంగోల్’ (రాజదండం) ఉంచుతారు.14 ఆగస్టు, 1947న, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మొదటిసారిగా ఈ సెంగోల్‌ను అందుకున్నారు. ఇది బ్రిటీష్ వారి చేతుల నుండి అధికార మార్పిడికి చిహ్నంగా అభివర్ణించారు. అప్పటి మద్రాసులో సుప్రసిద్ధ నగల వ్యాపారి అయిన వుమ్మిడి బంగారు చెట్టి ఈ సెంగోల్‌ను రూపొందించారు. అద్భుతమైన రాజదండం సుమారు ఐదు అడుగుల పొడవు, పైభాగంలో ఒక ఎద్దు చెక్కబడి ఉంటుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు