- కేక్ కట్ చేసిన యూనియన్ నాయకులు..
- గోదావరి ఖని, 8వ కాలనీలో వేడుకలు..
మంగళవారం రోజు ప్రపంచ ఆటో దినోత్సవ సందర్భంగా.. పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని, 8వ కాలనీ సిరికే ఆటో స్టాండ్ లో వేడుకలు జరిగాయి.. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభినందలు తెలుపుకున్నారు యూనియన్ నాయకులు.. వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాహన మిత్ర సదుపాయం ఇక్కడ కూడా ఇవ్వాలని కోరడం జరిగినది.. 50 సంవత్సరములు నిండిన 20 సంవత్సరముల అనుభవం ఉన్న డ్రైవర్ కు పింఛన్ కూడా మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. ఈ కార్యక్రమంలో బోయని రమేష్, కే. సదానందం, ఎండీ అంకుశావల్లి, టి. సమ్మయ్య, జే. రవీందర్ రావు, యూ. రమేష్, ఎండీ రఫిక్, జీ. తిరుపతి తదితరులు పాల్గొన్నారు..