Saturday, May 18, 2024

వెల్ విజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంతా బోగస్..

తప్పక చదవండి
  • కూకట్ పల్లి, గోకుల్ ప్లాట్స్ 9వ ఫేస్ లో అమాయకులనే టార్గెట్ చేస్తూ అవినీతి దందా..
  • అధిక వడ్డీల ఆశ చూపి డిపాజిట్లు సేకరించి చేతులెత్తేసి ప్లాన్ తో ప్రజల జీవితాలతో చెలగాటం..
  • నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా తడి గుడ్డతో గొంతు కోస్తున్న వైనం…
  • శ్రీనివాసరావు కందుల.. సీ.ఈ.ఓ. ఎం.డి, జారుకునే లోపే
    నిఘా విభాగాల వారు అదుపులోకి తీసుకోవాలి..
  • మాజీ పోలీస్ బాస్ సజ్జనార్ లాగా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్..

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్లాట్ నెంబర్ 1443 వెంకటరమణ కాలనీ, గోకుల్ ప్లాట్స్, 9వ ఫేస్ లో అక్రమ అవినీతి తంతు…కూకట్ పల్లి కేంద్రంగా వెల్ విజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో లేని కంపెనీలు ఉన్నట్లు సృష్టించి.. చిట్ ఫండ్ కంపెనీ అంటూ.. రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్మకం అంటూ కొద్ది రోజుల్లోనే మీ డబ్బుకు రెట్టింపు డబ్బు వస్తుంది అని మాయమాటలు చెప్పి.. అక్రమ పద్ధతిలో నెట్వర్క్ మార్కెటింగ్ నిర్వహిస్తున్నారు..

ఈ నిర్వాకానికి కారణభూతుడు శ్రీనివాసరావు కందుల, సీ.ఈ.ఓ. ఎం.డి కర్మ కర్త క్రియ అన్ని ఈయనే.. పదుల సంఖ్యలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా అమాయకులైన ప్రజలను మాయమాటలతో మోసం చేసే విధంగా డబ్బులు సేకరిస్తున్నారు.. మీరు పెట్టుబడులు పెట్టండి మీ డబ్బులు కొద్ది రోజుల్లోనే డబుల్ అవుతాయి.. వెల్ విజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో దుఖాణం నిర్వహణ.. వెల్ విజన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్.. తక్కువ ధరకు ఫార్మ్ ల్యాండ్ లో ప్లాట్లు విక్రయిస్తాం.. మీరు పెట్టుబడి పెడితే 10 శాతం వడ్డీ కూడా ఇస్తాం..
వీరికి ఎక్కడ కూడా వెంచర్లు.. ల్యాండ్ అనేది లేనేలేదు.. అయినా కూడా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా మేఘన ఫామ్స్ లాండ్స్, మాచాపూర్, వరంగల్ లో ఫార్మ్ లాండ్స్ ఉన్నట్టు బ్రోచర్లు.. చందనవల్లి గ్రామం, నకిరేకల్ మండలం, నల్గొండ జిల్లాలో లేని ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నట్లు.. కొండవీడు ప్రక్కన సంక్రాంతి పాడు గ్రామం, నాదెండ్ల మండలం, గుంటూరు జిల్లాలో ఆకర్షవంతమైన బ్రోచర్లు సృష్టించి, లేని భూమి ఉన్నట్లుగా అమ్మే ప్రయత్నం.. వెల్ విజన్ హోమ్ అప్లయిన్స్ టివి, ఫ్రిడ్జ్, ఏసీ పలు ఎలక్రిట్ గృహ ఉపకారణాలపై వెల్ విజన్ పేరుతో బ్రాండింగ్.. భారీ మొత్తంలో వెల్ విజన్ గోడౌన్స్ నిర్వహించబోతున్నాం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకో గోడౌన్ ప్రారంభించబోతున్నాం. గౌడౌన్ లీజ్ కోసం, ప్రాంచైసీ కోసం డబ్బులు పెట్టుబడులు పెట్టండి.. 5 నుండి 10 శాతం వడ్డీ రూపంలో చెల్లిస్తాం. వెల్ విజన్ ట్రేడింగ్ ఆన్ లైన్ షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టి మేము ఒళ్ళు దగ్గరపెట్టుకుని పనిచేసి 200 రోజుల్లో మీ డబ్బును రెట్టింపుచేసి మీకు తిరిగి చెల్లిస్తాం.. వెల్ విజన్ సేవా ఫౌండేషన్.. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం.. పుణ్యం మీకు మూటగట్టి పెడతాం.. వెల్ విజన్ గోట్ ఫార్మింగ్.. మేకల, గొర్ల పెంపకం.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను తీసుకువచ్చే లాభసాటి వ్యాపారం.. రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులైపోతారు.. అంటూ తమ మాయ మాటలతో సామాన్య ప్రజానీకాన్ని కళ్ళముందే పేదవాన్ని కోటీశ్వరున్ని చేస్తారు.. కూకట్ పల్లి గోకుల్ ప్లాట్స్ 9వ ఫేస్ లో టీవీలు, ఫ్రిడ్జ్ లు, గృహోపకరణాల వ్యాపారం నిర్వహించే దుఖాణం నష్టాలు రావడంతో.. గొలుసుకట్టు వ్యాపారాన్ని తెరమీదకు తీసుకుని వచ్చింది వెల్ విజన్.. సామాన్య ప్రజలకు టీవీ, ఫ్రిడ్జ్ లాంటి గిఫ్టులు ఎరజూపి.. భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించింది.. ఈ నెట్ వర్కింగ్ మార్కెటింగ్ అంటేనే మోసం.. ఈ మోసపూరిత వ్యాపారాన్ని నిర్వహిస్తూ.. వెల్ విజన్ సంస్థ ఎప్పుడు బిచాణా ఎత్తేస్తుందో.. ఆ లోపే సదరు శ్రీనివాస రావుని నిఘా విభాగాల వారు అదుపులోకి తీసుకోవాలి..

- Advertisement -

మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ దందా అమాయకులను అప్పులపాలు చేస్తోంది. రాష్ట్ర పోలీసులు పట్టుకున్న కేసుల్లో రూ.20 వేల కోట్ల మేర మల్టీలెవల్‌ మార్కెటింగ్‌లో వేలాదిమంది మోసపోవడం సంచలనం రేపుతోంది. దేశవ్యాప్తంగా మల్టీలెవల్‌ మార్కెటింగ్‌పై నిషేధం విధిస్తూ కేంద్రం 1978లోనే చట్టాన్ని తీసుకువచ్చింది. మనీ సర్క్యులేషన్‌ స్కీం నిషేధిత యాక్ట్‌ కింద గిఫ్ట్‌ల పేరిట డబ్బులు వసూలు చేసి, చెయిన్‌ లింక్‌ ద్వారా మార్కెటింగ్‌ చేయడం పూర్తిగా అక్రమమేనని ఈ చట్టం ద్వారా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో ఆమ్వే ప్రాడక్ట్‌పై ఇదే తరహా మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ కేసును సీఐడీ నమోదు చేసింది. ఇటీవల బయటపడుతున్న మల్టీలెవల్‌ కంపెనీ మోసాలు వేలకోట్లకు చేరడంతో రాష్ట్రంలో మళ్లీ మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మాఫియా చాపకింద నీరులా దందా సాగిస్తున్నట్టు స్పష్టమవుతోంది.

శ్రీనివాసరావు కందుల తన విశేషమైన పరిజ్ఞానంతో ఆకర్షవంతవంతమైన మనీ సర్క్యులేషన్ స్కీం ల ఎరచూపి, సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తూ.. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు.. గడ్డిని కూడా లక్షల్లో అమ్మేస్తామని మాటల గారడీతో అమాయకులైన ప్రజలను బుట్టలో వేసుకొని కోట్లు మూట గట్టుకున్నారు.. ఎప్పుడు బిచాణా ఎత్తేస్తాడో ఆ ప్రభువుకే ఎరుక.. ఇప్పటికైనా అమాయకులు రోడ్డునపడి అఘాయిత్యాలు చేసుకోకముందే నిఘా విభాగాల అధికారులు కళ్లుతెరిచి తగు చర్యలు తీసుకోవాలి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు