Saturday, April 27, 2024

తిరుమల భక్తులకు గుడ్‌ న్యూస్‌..

తప్పక చదవండి
  • 25 నుంచి స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల..

తిరుమల లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఆగస్టు, సెప్టెంబరు నెల‌లకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటా ను జూలై 25న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా అదే రోజు అక్టోబరు కోటాను కూడా విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

తిరుమ‌ల శ్రీ‌వారి అంగప్రదక్షిణ టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జూలై 24న ఉదయం 10 గంట‌ల‌కు విడుదల చేస్తామన్నారు. శ్రీవాణి ట్రస్టు దాతలకు దర్శనం, గదులకు సంబంధించి అక్టోబరు కోటాను జూలై 24న ఉదయం 11 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్లు వివరించారు.

- Advertisement -

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుందని అన్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు